జగన్ ఊరేగారు.. జనం అల్లాడారు
ఉభయ జిల్లాల్లో మంగళవారం సాగిన ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభలు జనాలకు అష్టకష్టాలు తెచ్చిపెట్టాయి.
సిద్ధం బస్సు యాత్ర, సభలతో ప్రజలకు ప్రత్యక్ష నరకం
కరెంటు కోత.. ఆపై ఉక్కపోతతో సతమతం
ట్రాఫిక్ సమస్యకు తోడు బస్సుల్లేక ఇబ్బందులు
భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి సమీపాన వంతెనపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎండ తీవ్రతతో చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడారు.
భీమవరం, ఉండి, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు గ్రామీణం,న్యూస్టుడే: ఉభయ జిల్లాల్లో మంగళవారం సాగిన ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభలు జనాలకు అష్టకష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రధాన మార్గాల్లో సైతం ట్రాఫిక్ మళ్లింపులు, రహదారుల మూసివేతతో సాధారణ ప్రజలతో పాటు వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
తీవ్ర ఎండలో గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని వృద్ధుల నుంచి చిన్నారులు వరకు నరకయాతన అనుభవించారు.ఉండి సెంటర్, భీమవరం బైపాస్, బీవీ రాజు కూడలిలో మధ్యాహ్నం నుంచే రాకపోకలను నిలిపివేయడంతో పట్ణణంలోని ప్రధాన రహదారులు, పైవంతెన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు యాత్ర నిడమర్రు, గణపవరం, ఉండి మండలాల మీదుగా సాగింది. అధికారులు స్వామిభక్తిని ప్రదర్శించి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించారు. గణపవరం, సరిపల్లె గ్రామాల్లో రహదారుల వెంబడి ఉన్న చెట్లను గణపవరం పోలీసులు దగ్గరుండి మరీ నరికి వేయించారు. రహదారిపై నుంచి వెళ్లిన విద్యుత్తు తీగలు, అంతర్జాలం, టీవీ కేబుళ్లను తొలగించడంతో మంగళవారం ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు సరఫరా నిలిచింది. అసలే వేసవి కాలం.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ఉక్కపోతకు సతమతమయ్యారు.
విద్యుత్తు సరఫరా లేక వరండాలో వైద్యం
మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. గణపవరం పీహెచ్సీలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రహదారి ప్రమాదంలో గాయపడిన యువకుడికి సిబ్బంది వరండాలో పరదాల చాటున చికిత్స అందించారు.
గణపవరంలో పోలీసు పర్యవేక్షణలో చెట్ల నరికివేత
విలవిల్లాడిన వ్యాపారులు.. వ్యాపార సముదాయాల్ని మూసివేయాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో గణపవరం కూడలి వెలవెలబోయింది. ఐస్క్రీం, పాలు, పెరుగు పదార్థాలు విక్రయించే వ్యాపారులకు నష్టం వాటిల్లింది. విద్యుత్తు నిలిచిపోవడంతో ఐస్ పరిశ్రమలో చేపలు, రొయ్యల ప్యాకింగ్లు నిలిచిపోయాయి. రొయ్యల చెరువుల్లో పంకాలు తిప్పేందుకు రైతులు పెట్రోలు బంకులకు పరుగులు తీశారు. తీరా అక్కడికి వెళ్లాక జనరేటర్ పనిచేయక పోవడంతో డీజిల్ను పెంటపాడు, అత్తిలి తదితర ప్రాంతాల నుంచి తీసుకు రావాల్సి వచ్చింది. బ్యాంకుల్లో బ్యాటరీలు మొరాయించడంతో సేవలు నిలిచి పోయాయి. సరిపల్లెలో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయారు. నీటిశుద్ధి కేంద్రాలకు మంచినీరు తెచ్చుకుందామని వెళ్తే విద్యుత్తు లేనందున అక్కడా దొరక్క నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక విద్యార్థులు పాఠశాలల్లో నరక యాతన అనుభవించారు. పాఠశాలలు వదిలాక ఇంటికి వెళ్లేందుకు యత్నిస్తే పోలీసుల ఆంక్షల కారణంగా వాహనాలు రాకపోవడంతో ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.
216ఏ జాతీయ రహదారి నుంచి భీమవరం వైపు వాహనాలు వెళ్లకుండా నారాయణపురం వద్ద రహదారిని మూసివేశారు.
ఆర్టీసీ బస్సులను భీమవరం సభకు జనాల్ని తీసుకెళ్లేందుకు కేటాయించడంతో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నీరు లేక నీరసించి.. సీఎం జగన్ వస్తున్నారంటూ ఉదయం 6 గంటలకే కరెంటు ఆపేశారు. కుళాయిల ద్వారా మంచినీరు రానందున అటు తాగడానికి లేక, ఇటు స్నానాలు చేయడానికి వీలు లేక నరకయాతన అనుభవించాం. జగన్ వస్తున్నారంటే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుందని టీవీల్లో చూడటమే గానీ, ఈ రోజు ప్రత్యక్షంగా చూశా.
మహాలక్ష్మి, గృహిణి, సరిపల్లె
ఉక్కిరిబిక్కిరయ్యాం.. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ఉక్కబోతకు ఉక్కిరి బిక్కిరయ్యాం. రోజూ మాదిరే తాగునీరు వస్తుందని భావించాం. గుక్కెడు నీరు లేకుండాపోయింది. టిఫిన్, భోజనం వండుకునే అవకాశం లేకుండా చేశారు. ప్రత్యక్ష నరకం చవిచూశాం
నరసమ్మ, గృహిణి
దుకాణాలు మూత.. విద్యుత్తు లేనందున టిఫిన్ సెంటర్లు, హోటళ్లు పని చేయలేదు. దుకాణాలు మూసివేశారు. నగదు జమ చేసేందుకు బ్యాంకులకు వెళ్తే అక్కడా సేవలు నిలిచిపోయాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు గణపవరం వచ్చారు కానీ ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.
బుద్ధారపు పుల్లయ్య, గణపవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు
[ 29-04-2024]
వైకాపాకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. -
జగనన్న బీమాయాజాలం
[ 29-04-2024]
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
నేటి నుంచి పవన్ ప్రచార భేరి
[ 29-04-2024]
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
[ 29-04-2024]
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. -
ఆదుకోమంటే బాదేశారు
[ 29-04-2024]
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. -
ప్రలోభాల బటన్ నొక్కేశారు!
[ 29-04-2024]
ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. -
ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
[ 29-04-2024]
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. -
వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 29-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
కొల్లేరుపై అన్నీ కోతలే
[ 29-04-2024]
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. -
జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
[ 29-04-2024]
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. -
‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
[ 29-04-2024]
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
[ 29-04-2024]
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. -
ఇంటింటికీ ప్రచార వాహనం....
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
[ 29-04-2024]
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. -
కొత్త ఓటర్లు 24,599 మంది
[ 29-04-2024]
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్ 15 వరకూ గడువిచ్చింది. -
నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన
[ 29-04-2024]
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్