Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: బొగ్గు గనులు, సొరంగాల్లోకి వెళ్లి ప్రతికూల పరిస్థితుల్లో అక్కడే చిక్కుకుపోయిన ఎన్నో ఘటనలు చూస్తున్నాం. విధుల్లో భాగంగా కొందరు.. సాహస యాత్రలకు వెళ్లిన మరికొందరు తిరిగి రాలేని దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం వరకు అనేక ఘటనలు ప్రపంచాన్ని కదిలించాయి. సాహసోపేతమైన ఆపరేషన్లతో బాధితులను రక్షించారు. ఉత్తర్కాశీ రెస్క్యూ నేపథ్యంలో.. ఈ తరహా భారీ ఆపరేషన్లు ఓసారి గుర్తుచేసుకుంటే..
రాణిగంజ్ రెస్క్యూ 1989:
మహబీర్ కొలియరీ బొగ్గు గనిలో కార్మికులు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్లోని రాణిగంజ్ (Raniganj Coalfields) ప్రాంతంలో ఉన్న ఈ బొగ్గు గనిలో 232 కార్మికులు పనిచేస్తున్నారు. నవంబర్ 13, 1989న బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో గని గోడలకు పగుళ్లు వచ్చాయి. దాంతో గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని పసిగట్టి రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. వెంటనే 161 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఈ క్రమంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 65 మంది మాత్రం అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. జశవంత్ గిల్ అనే మైనింగ్ ఇంజినీర్ ఇచ్చిన ఓ వినూత్న ఐడియా ఆపరేషన్లో కీలకమైంది. బోర్వెల్ సాయంతో ఓ భారీ స్టీల్ పైపును లోపలికి పంపించారు. అందులోనుంచి ఒక్కొక్కరు బయటకు రావడంతో కథ సుఖాంతమైంది.
ప్రిన్స్ బోర్వెల్ ప్రమాదం 2006:
హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. అంతకుముందు ఈ తరహా ఘటనలు పెద్దగా వెలుగు చూడకపోవడంతో.. మీడియాలోనూ ఇది కాస్త ప్రధాన వార్తగా నిలిచింది. అతడిని (Prince's 2006 borewell accident) బయటకు తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేశాయి. దాని పక్కనే మరో బోరుబావి ఉండటం ఆపరేషన్కు అనుకూలించింది. దాని ద్వారా మూడు అడుగుల వ్యాసం కలిగిన ఓ ఐరన్ పైపును లోపలికి పంపించారు. చివరకు 50గంటల రెస్క్యూ తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
చిలీ మైనింగ్ రెస్క్యూ 2010: 69 రోజుల ఆపరేషన్..
చిలీలోని ఓ బంగారు గని ప్రమాదం కూడా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 5, 2010న శాన్ జోస్ గోల్డ్ అండ్ కాపర్ గని కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే, లోపల ఉన్న అత్యవసర షెల్టర్లో తలదాచుకున్నారు. బాహ్య ప్రపంచంతో సంప్రదించే వీలులేకుండా పోయింది. కేవలం పరిమిత ఆహారం, కొద్దిపాటి నీటితోనే గడపాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు 2వేల అడుగుల లోతుకు చిన్న రంధ్రాన్ని తవ్వారు. అందులోకి ఓ నోట్ను పంపించారు. తామంతా సురక్షితంగా ఉన్నామని చెప్పడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోనికి ఆహారం, నీరు, ఔషధాలు పంపించారు. చివరకు 69 రోజుల తర్వాత ఓ గొట్టం నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడాన్ని ప్రజల కళ్లల్లో మెదులుతూనే ఉంది.
క్యూక్రీక్ మైనింగ్ ప్రమాదం 2002:
అమెరికా పెన్సిల్వేనియాలో ఉన్న ఓ గనిలో జులై 24, 2002న ప్రమాదం చోటుచేసుకుంది. వందల అడుగుల లోతులో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. భూగర్భం నుంచి నీరు చేరుతుండటంతోపాటు ఆక్సిజన్ కూడా నిండుకుపోవడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. తీవ్ర కృషి చేసిన రెస్క్యూ సిబ్బంది 77గంటల తర్వాత 22 అంగుళాల పైపు సాయంతో బయటకు తీసుకురాగలిగారు.
థాయ్ కేవ్ రెస్క్యూ 2018: 18 రోజుల సాహసం..
ఫుట్బాల్ ఆడే బాలలు తమ కోచ్తో కలిసి థాయ్లాండ్లోని ఓ గుహలో (Tham Luang Cave)కి వెళ్లగా.. ఆకస్మిక వరద ప్రవాహంతో అందులో చిక్కుకుపోయారు. 2018లో జరిగిన ఈ సంఘటన (Thailand cave rescue) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి.. 18 రోజులపాటు (జూన్ 23, 2018 నుంచి జులై 10 వరకు) తీవ్ర ప్రయత్నాల అనంతరం సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. బ్రిటన్కు చెందిన ఇద్దరు డైవర్లు కీలకంగా వ్యవహరించగా.. ఇతర దేశాలకు చెందిన మరో 90 మంది డైవర్లు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 10 వేల మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూసిన ఈ భారీ రెస్క్యూపై అనేక సినిమా, డాక్యుమెంటరీలు, పుస్తకాలు కూడా వచ్చాయి.
ఉత్తర్కాశీ ఆపరేషన్: 17 రోజులు సొరంగంలోనే..
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. సొరంగంలోకి చేరేందుకు దాదాపు ఆరు మార్గాల్లో ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. అత్యంత సాంకేతికత యంత్రాలను వినియోగించినప్పటికీ.. చివరకు నేలకు సమాంతరంగా ‘ర్యాట్ హోల్ మైనింగ్’ చేపట్టి కార్మికులు ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగారు. గనిలో అమర్చిన ఓ పైపు ద్వారా కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్