Playa de Las Teresitas: లక్షల టన్నుల సహారా ఎడారి ఇసుకతో తయారైన బీచ్.. ఎక్కడుందో తెలుసా!
స్పెయిన్లోని (Spain) కేనరీ ఐలాండ్స్లో ఎన్నో ముఖ్యమైన బీచ్లున్నాయి. వాటిలోని ప్లేయా డి లాస్ టెరెసిటాస్ (Playa de Las Teresitas) బీచ్ ప్రత్యేకత ఏంటంటే అది సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. సుమారు 2.7లక్షల టన్నుల ఇసుక పోగు చేసి దానిని సృష్టించారు. ఆ బీచ్ (Beach) నిర్మాణానికి గల కారణాలు తెలుసుకోండి.
Image : Club Canary
ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్న ప్లేయా డి లాస్ టెరెసిటాస్ (Playa de Las Teresitas) బీచ్ (Beach) గతంలో అలా ఉండేది కాదు. దాని తీరం గులకరాళ్లు, నల్లని అగ్నిపర్వత ఇసుకతో కళావిహీనంగా కన్పించేది. సముద్రంలో (sea) ఇప్పుడున్న ప్రశాంతత ఆనాడు లేదు. అలలు బలంగా ముందుకొచ్చి ఒడ్డునున్న రాళ్లను ఢీకొట్టి పోయేవి. తీరం నిత్యం అల్లకల్లోలంగా ఉండటంతో దానికి ప్రమాదకర బీచ్ అనే ముద్ర పడింది. కానీ, శాంటా క్రూజ్ నగరానికి దగ్గర్లో ఉన్న ఏకైక బీచ్ ఇది మాత్రమే కావడంతో అప్పటి అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. మిగతా బీచ్లలో ఉన్న కొద్దిపాటి మంచి ఇసుకను కూడా కొన్ని నిర్మాణ సంస్థలు తమ అవసరాల కోసం తరలించుకుపోయేవి. ఇదీ నాటి పరిస్థితి.
కృత్రిమ బీచ్ నిర్మాణానికి అడుగులు
1953లో శాంటా క్రూజ్ సిటీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే లాస్ టెరెసిటాస్లో కృత్రిమ బీచ్ నిర్మించడం. ఆ డిజైన్ను రూపొందించడానికి ఎనిమిదేళ్లు పట్టింది. స్పానిష్ మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ఆమోదం పొందడానికి తాత్సారం జరగడంతో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. మొత్తానికి కృత్రిమ బీచ్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. తొలి దశలో భాగంగా బీచ్ను బలమైన అలలు ఢీకొట్టకుండా చర్యలు తీసుకున్నారు. అందుకోసం అతిపెద్ద ‘బ్రేక్ వాటర్’ నిర్మించారు. ఈ చర్య సత్ఫలితాన్నిచ్చింది. అంతేకాకుండా తీరంలో కొత్తగా తెచ్చి పోసే ఇసుక సముద్రంలోకి జారకుండా అడ్డుకట్ట వేసింది. తదుపరి చర్యల్లో భాగంగా సహారా ఎడారి నుంచి సుమారు 2,70,000 టన్నుల తెల్లని ఇసుక తెప్పించారు. ఆ ఇసుకను 1.3 కిలోమీటర్ల మేర.. 80 మీటర్ల వెడల్పులో పరిచారు. అలా 1973 నాటికి కృత్రిమ బీచ్ను అభివృద్ధి చేశారు. తర్వాతి కాలంలో ఇది స్థానికులకు, ప్రపంచ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారిపోయింది.
మరిన్ని బీచ్ల అభివృద్ధి
ఇదే తరహాలో కేనరీ ఐలాండ్స్లోని పలు బీచ్లను బాగు చేసేందుకు పశ్చిమ సహారా నుంచి ఇసుక తరలించడం తర్వాతి కాలంలో పరిపాటిగా మారింది. భవన నిర్మాణ అవసరాలకు సైతం సహారా ఇసుకే ఆధారమైంది. దాంతో అక్రమ ఇసుక రవాణా ఊపందుకుంది. ఫలితంగా పశ్చిమ సహారా పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇసుక వ్యాపారం కారణంగా మొరాకో అధికారులు, కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. అధిక ఇసుక వెలికితీత మాత్రం పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగిల్చింది.
విధ్వంసం.. వినాశకరం
ఇసుక ప్రకృతి ప్రసాదించిన పరిమిత వనరు. దాన్ని ఇష్టారీతిన తోడుకోవడం మానవుల మనుగడకు ఎంత మాత్రం మంచిది కాదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం.. ప్రపంచం మొత్తం మీద ఏడాదికి 50 బిలియన్ మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ ఇసుకతో ఏకంగా ప్రపంచం చుట్టూ భారీ గోడ కట్టవచ్చట. ఇసుకకు డిమాండ్ ఏర్పడటంతో బీచ్లు, నదీ గర్భాల నుంచి తవ్వకాలు ఎక్కువయ్యాయి. ఎడారి ఇసుక మరీ నునుపుగా ఉంటుంది కాబట్టి వదిలేశారని, లేకుంటే ఈ పాటికి ఇసుక లేని ఎడారులు కూడా చూసేవారమని పర్యవరణ వేత్తలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల నుంచి ఇసుక వెలికితీత జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలను అభ్యర్థిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్