చైనా బ్యాచ్.. మాటలూ నకిలీనే..!
చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాకమునుపే 1962లో భారత్పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు
ముందే పసిగట్టిన భారత సైన్యం..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాక ముందే 1962లో భారత్పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు తూట్లు పొడిచింది. మొన్నటికి మొన్న చైనా-బ్రిటన్ ఒప్పందాన్ని తుంగలోతొక్కి హాంకాంగ్ను గుప్పిట్లో బంధించింది. ఇలా చెప్పుకొంటే పోతే చైనా కథలు చాంతాడంత ఉంటాయి. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ను కూడా ఇలానే మోసం చేయాలని డ్రాగన్ ప్రయత్నించింది. చైనా అధికారుల తీరు.. ఆప్యాయతలపై అనుమానం వచ్చిన భారత్ నిఘా వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఆగస్టు 28న ఏం జరిగింది..
చుషూల్ వద్ద సైనికాధికారులతో చైనాకు చెందిన కమాండర్లు లోకల్ హాట్లైన్లో చర్చలు జరిపారు. తొలుత చైనా నుంచి అధికారులు భారత్ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలు మాట్లాడుకొన్నాయి. రాత్రివేళలో ఇరుపక్షాల దళాలు గస్తీలు నిర్వహించకూడదని చైనా అధికారులు పలుమార్లు చెప్పారు. దీంతో భారతీయ కమాండర్లకు వారి తీరుపై అనుమానం వచ్చింది. గతంలో వారు చెప్పినవి ఏవీ చేసిన దాఖలాలు లేవు. గల్వాన్ వద్ద కూడా ఇలానే మోసపూరితంగా వ్యవహరించింది. ఇవన్నీ మదిలో మెదిలి మనవాళ్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.
ఆగస్టు 28 రాత్రి తొలిసారి భారత నిఘా బృందం మాల్డోలో సాయుధ వాహనాల కదలికను గుర్తించాయి. దీంతో డ్రోన్లను రంగంలోకి దించి పీఎల్ఏ కదలికలపై నిఘా వేశారు. డ్రాగన్ దళాలు ఎల్ఏసీ వైపుగా ప్రత్యేక లక్ష్యం వైపు కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే భారత ఎస్ఎఫ్ఫ్ దళాలు రంగంలోకి దిగాయి. చుషూల్లోని కీలకమైన శిఖరాలపై పట్టు సాధించి రెఖిన్ పాస్, స్పంగూర్ గ్యాప్పై భారత వ్యూహాత్మక పట్టును సాధించాయి. దీంతో చైనా దళాలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్ తగిన సంఖ్యలో అక్కడ దళాలను మోహరించింది. ఆ తర్వాత భారత దళాలు పాంగాంగ్ సరస్సు వద్ద ఉత్తర భాగంలోని ఫింగర్4 సమీపంలోని కీలక స్థానాలకు కూడా చేరింది.
భారీగా మోహరిస్తున్న డ్రాగన్ దళాలు..
ఈ ఘటన తర్వాత భారీ సంఖ్యలో చైనా దళాలు మోహరింపు వేగవంతమైంది. వేల సంఖ్యలో దళాలు, భారీ శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఆగస్టు 30 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా స్పంగూర్ గ్యాప్ నుంచి గురాంగ్హిల్, మగర్ హిల్ సమీపంలోకి ఇవి చేరుతున్నాయి. దీంతో భారత్ కూడా డ్రాగన్కు సరితూగే దళాలను అక్కడికి తరలించింది. మిలీషియా దళాలను కూడా చైనా తీసుకొచ్చింది. వీటిల్లో సైనికులు, బాక్సర్లు, స్థానిక ఫైట్క్లబ్ల సభ్యులు ఉంటారని భావిస్తున్నారు. ఈ బృందాలు పీఎల్ఏలో రిజర్వు ఫోర్స్గా పనిచేస్తున్నాయి. ఇవి యుద్ధ సమయంలో పీఎల్ఏ సైనిక ఆపరేషన్లలో సహాయకారిగా వ్యవహరిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
-
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM