Technology : మనిషిని పోలిన మనుషులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు!
ఒకరి పోలికలతో ఉన్న మరి కొంత మంది వ్యక్తులను గుర్తుపట్టి చూపించే సాంకేతిక పరిజ్ఞానం(technology) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఉపయోగించిన కొందరు తమలాంటి పోలికలతో ఉన్న వారిని కలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోండి!
(Image : youtube)
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని విన్నాం. అయితే ఆ ఏడుగురు ఎక్కడుంటారో ఎవరికైనా తెలుస్తుందా? పోనీ.. కనీసం మనలా ఎవరో ఒకరైనా ఉన్నారే అనుకుందాం. వారిని కలవాలంటే.. ఫేస్బుక్(facebook), ట్విటర్(twitter), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్(instagram) ఇలా ఏ సామాజిక మాధ్యమంలో వెతకాలి? వారు మనకు అసలు ఎదురుపడతారా? ప్చ్.. కష్టం అనుకుంటున్నారా? అదేమీ అంత కష్టం కాదని నిరూపిస్తోంది Twinstrangers.com అనే వెబ్సైట్. ఇదే పేరుతో ఓ యాప్ కూడా ఉంది.
ఈ వెబ్సైట్ నుంచి చాలా మంది తమను పోలిన వ్యక్తులను కలుసుకున్నారు. ఆ క్షణంలో వారి ఆనందానికి అవధులు లేవు. అలా అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన అంబ్రా, టెక్సాస్కు చెందిన జెన్నిఫర్ మీట్ అయ్యారు. వయసు రీత్యా ఇద్దరికీ పదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ, వారి ముఖ కవళికలు(face) మాత్రం ఒక్కటిగానే ఉండటం ఆశ్చరకరమైన విషయం. ఇలా తమలాంటి పోలికలతో ఉన్న వ్యక్తులను కలుసుకున్న చాలామంది వారి అనుభవాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు.
గుర్తు పట్టాలంటే ఏం చేయాలి?
ప్రస్తుతం ఈ వెబ్సైట్(website)లో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పోలికలతో ఉన్నవారిని గుర్తించాలంటే మన అసలైన రూపం ఎలా ఉంటుందో అలా ఇందులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫొటో(photo)లో మన ముఖం కచ్చితంగా మధ్యలోనే ఉండి తీరాలి. సైడ్ లుక్లో ఉన్న చిత్రాలు ఇందులో అప్ చేయడానికి పనికి రావు. పైగా ట్రాక్ చేయడం కష్టతరమవుతుంది. ముఖంపై వెంట్రుకలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు, చెవులు అద్దంలో ఎలా కన్పిస్తుంటాయో అచ్చం అలాంటి ఫొటోనే ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ జెండర్, పేరు, ఊరు, దేశం తదితర వివరాలన్నీ సమర్పించాలి. ప్రొఫైల్ గ్యాలరీలో మరో ఐదు రకాల ఫొటోలను అదనంగా జత చేయాల్సి ఉంటుంది.
ఎలా వెతికి పెడుతుంది?
ఈ వివరాలు నమోదు చేసిన తరువాత వెబ్సైట్లో కృత్రిమ మేధ సహాయంతో మన పోలికలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత మన ప్రొఫైల్ ఆధారంగా అప్పటికే రిజస్టర్ అయిన వారి ముఖాలను పోలుస్తూ.. అందులో మీలాగే ఉన్నవారి ఫొటోలను గుర్తించి ఒక ఫోల్డర్లో పంపిస్తుంది. మీకు తగ్గ వ్యక్తి దొరికితే వారిని మై ట్విన్స్ ఫోల్డర్లోకి పంపించాలి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా మీతో పరిచయం పెంచుకోవడానికి వీలుంటుంది. విభిన్న రకాల ఫొటోలు జత చేసే కొద్దీ మీ పోలికలు ఉన్న మరింత మంది వ్యక్తులను ఈ వెబ్సైట్లోని సాంకేతికత వెతికిపెడుతుంది.
నోట్ : వినూత్న సాంకేతికత అంతర్జాలంలో అందుబాటులో ఉందని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. అలాంటి వెబ్సైట్స్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలో.. వద్దో నిర్ణయించుకోవాల్సింది మీరే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ