china : ఆ ‘కూతురు ఉద్యోగం’ వెరైటీగా చేస్తోంది.. చైనాలో వింత సంఘటన!
తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి ఓ మహిళ తాను చేస్తున్న ఉద్యోగం (Job) మానేసింది. మంచిదేగా అనుకుంటున్నారా?‘ఫుల్ టైమ్ డాటర్’గా (Full time daughter) కొనసాగేందుకు ఆమె వారి దగ్గర జీతం (Salary) తీసుకుంటోంది. చైనాలో (China) చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకోండి.
చైనాకు (China) చెందిన నియానన్ అనే మహిళ ఏడాది కిందట ఓ న్యూస్ ఏజెన్సీలో పనిచేసేది. అందువల్ల 24 గంటలూ ఆమెకు ఫోన్లు వస్తుండేవి. గత 15 ఏళ్లుగా ఆ పని చేస్తూ తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే.. అంత కన్నా మంచి ఉద్యోగం ఇస్తామని ఆమె తల్లిదండ్రులు తనకు భరోసా ఇచ్చారు. అంతే కాదు ఆర్థికంగానూ అండగా నిలబడతామని చెప్పారు. ఇంతకీ వారు ఇస్తామన్న ఉద్యోగం ఏంటో తెలుసా? ‘కూతురు ఉద్యోగం’. అవును.. మీరు చదువుతున్నది నిజమే. నియానన్ ఇంట్లోనే ఉంటూ తమ బాగోగులు చూసుకుంటే నెలకు 4వేల యువాన్లు ఇస్తామని చెప్పారు. దాంతో నియానన్ ఇంట్లో ఉద్యోగం చేయడానికి వెంటనే ఓకే చెప్పేసింది. ఫలితంగా ఆమెకు అద్దె ఇంట్లో ఉండాల్సిన బాధలు తప్పాయి. తిండిపై పెట్టే ఎన్నో ఖర్చులు తగ్గాయి. ఇంకా గృహోపకరణాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె ‘ఫుల్ టైమ్ డాటర్’గా కొనసాగుతోంది.
ఇదే ఉద్యోగ జీవితం!
నియానన్ ఏడాది కాలంగా ఇంటిపట్టున ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటోంది. దాని గురించి చెబుతూ ఈ కొత్త వృత్తి ‘ప్రేమతో నిండిపోయిందని’ అంటోంది. ఆమె తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కు వెళ్తోంది. వారితో కలిసి వంట చేస్తోంది. ఎక్కడికెళ్లాలన్నా తానే డ్రైవింగ్ చేస్తోంది. అంతే కాదు రోజూ ఓ గంటపాటు వారితో కలిసి నృత్యం చేస్తోంది.
ఇవే కాకుండా ఇంట్లో, బయట ఉన్న ఎలక్ట్రానిక్ సామగ్రి నిర్వహణ చూడటం, నెలకు ఒకటి లేదా రెండు ట్రిప్ల విహార యాత్ర ప్లాన్ చేయడం కూడా ఆమె ఉద్యోగంలో ఓ భాగం. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్నప్పటికీ ఆమెకు మరింత ధనం సంపాదించాలనే ఆలోచనలు వస్తున్నాయట. వాటి గురించి ప్రస్తావిస్తే ‘నీకు ఏ పని నచ్చితే దానికే వెళ్లమని’ ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒక వేళ ఏ పనీ చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండి మాతో గడపమని చెబుతున్నారు.
జీతం ఎలా ఇస్తున్నారంటే..
వృద్ధులైన తల్లిదండ్రులు నియానన్కు జీతం ఎలా ఇస్తున్నారనే సందేహం చాలా మందికి ఈ పాటికే వచ్చి ఉంటుంది. వారికి నెలకు లక్ష యువాన్ల పింఛను వస్తుంది. అందులో నుంచే నియానన్కు 4వేల యువాన్లు చెల్లిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఆన్లైన్లో పెద్ద చర్చకు తావిచ్చింది. కొందరు ఆ మహిళ తీరును విమర్శిస్తుండగా.. మరికొందరు తల్లిదండ్రులను మెచ్చుకుంటున్నారు.
కొందరికి మోదం.. ఖేదం
‘ఇలా తల్లిదండ్రులపై ఆధారపడి బతకడాన్ని చైనీస్ భాషలో ‘కెన్ లావ్’ అంటారు. అయినా ‘ఫుల్ టైమ్ డాటర్’ అని పిలవడం ఏంటని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఆ తల్లిదండ్రులు, కూతురు సంతోషంగా జీవిస్తుంటే మధ్యలో మనకెందుకు అభ్యంతరం’ అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
చైనాలో గత కొన్ని దశాబ్దాలుగా ‘996’ పని సంస్కృతి ఉంది. అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేయడం. దీంతో చాలా మంది అక్కడ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. యువత ఏకంగా పని చేయడమే మానేసి ‘లేయింగ్ డౌన్’ అనే సంస్కృతి వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియానన్ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండటం తప్పేమీ కాదని కొందరు వాదిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్