Just stop oil : క్రీడా మైదానాలే వారి ఉద్యమ శిబిరాలు.. శ్రుతి మించుతున్న ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తలు!
ఇంగ్లాండ్లో (England) తాము చేస్తున్న ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ (Just stop oil) ఉద్యమానికి ఊపు రావడం కోసం కొందరు క్రీడా మైదానాల్లోకి చొరబడుతున్నారు. తాజాగా యాషెస్ రెండో టెస్టులో అలాంటి పరిణామం చోటు చేసుకుంది.
లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య బుధవారం యాషెస్ రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిరసనకారులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. తమ వెంట తెచ్చుకున్న ఆరెంజ్ కలర్ పౌడర్ని మైదానంలో చల్లారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) నిరసనకారుల్లో ఒకరిని అమాంతం ఎత్తుకెళ్లి బౌండరీ అవతల పడేశాడు. అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. నిరసనకారులను ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనే గ్రూప్నకు చెందిన కార్యకర్తలుగా గుర్తించారు. అసలు ఏంటీ గ్రూప్? క్రీడా మైదానాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తెలుసుకోండి.
పర్యావరణ ఉద్యమం
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమాన్ని పర్యావరణ కార్యకర్తలు చేస్తున్నారు. చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా వాతావరణానికి భారీగా నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తూ ‘ఎక్స్టిన్షన్ రెబలియన్’, ‘ఇన్సులేట్ బ్రిటన్’ అనే సంస్థలు గతంలో ఉద్యమాలు చేశాయి. అవే డిమాండ్లతో ప్రస్తుతం ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోంది. మొదట ఈ కార్యకర్తలు చిన్న చిన్న ఉద్యమాలు చేశారు. వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో పంథా మార్చారు. గతేడాది ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే మైదానాల్లోకి చొచ్చుకొని పోయి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని సార్లు మైదానంలోకి ప్రవేశించిన వ్యక్తులు గోల్ కొట్టే దుందుడుకు యత్నాలకు సైతం పాల్పడ్డారు. క్రీడలకు ఉన్న ప్రాచుర్యం వల్ల వీరి ఉద్యమం అందరి దృష్టిలో పడింది. అప్పటి నుంచి ఆయిల్ టెర్మినల్స్, రద్దీ రహదారులు, క్రీడా మైదానాలను తమ ఉద్యమ శిబిరాలుగా మలుచుకున్నారు.
కొత్త లైసెన్సులు వద్దని..
యూకేలో చమురు, ఇతర శిలాజ ఇంధనాల అన్వేషణ కోసం ప్రభుత్వం కొత్త లైసెన్సులు ఇవ్వొద్దని ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ బృంద సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిర్ణయం ఇందుకు విరుద్ధంగా ఉంది. 2025 నాటికి 100 కొత్త ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులకు లైసెన్సులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఎక్స్టిన్షన్ రెబలియన్’ సంస్థ కేవలం వాతావరణ మార్పులపైనే ఆందోళనలు చేయగా.. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ మరిన్ని ప్రాధాన్య అంశాలతో ముందుకెళ్తోంది.
వివాదాస్పద ఘటనలివీ..
- తాజాగా లార్డ్స్ మైదానం వేదికగా యాషెస్ రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు.
- లండన్ రింగ్ రోడ్డు ఎం 25 మోటార్ వేను దిగ్బంధించారు.
- లండన్లోని నేషనల్ గ్యాలరీలో సూప్ పారబోశారు.
- శరీరానికి గమ్ పూసుకొని ప్రఖ్యాత పెయింటింగ్లను ధ్వంసం చేయడానికి యత్నించారు.
- షెఫీల్డ్లో జరిగిన వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ షిప్ పోటీలకు అడ్డు తగిలారు.
- బ్రిటిష్ గ్రాండ్ ప్రి రేసుకు అంతరాయం కలిగించారు.
- లండన్లో జరిగిన ఆర్హెచ్ఎస్ చెల్సీ ఫ్లవర్ షోను లక్ష్యంగా చేసుకున్నారు.
నిధులు ఎక్కడివి?
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమానికి ఎక్కువ శాతం నిధులు క్లైమెట్ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి వచ్చాయి. వాతావరణ మార్పులపై చేసే ఉద్యమాలకు నిధులు సమకూర్చేందుకు 2019లో ఈ యూఎస్ నెట్వర్క్ ఏర్పాటైంది. క్లైమెట్ ఎమర్జెన్సీ ఫండ్కు యూఎస్కు చెందిన ఐలీన్ గెట్టి నిధులు సమకూరుస్తున్నారు. ఆమె తాత పెట్రోలియం టైకూన్ జె పాల్ గెట్టి.
నిలువరించడానికి కొత్త చట్టం
‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తలను పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. కోర్టు వారిపై చర్యలు తీసుకుంది. అయినా వెనక్కి తగ్గకపోవడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం రహదారులు, రైల్వే మార్గాల్లో నిరసనలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగితేనే పోలీసులు నిరసనలను అడ్డుకోవాలని ప్రస్తుతం ఉన్న చట్టం చెబుతోంది. అయితే కొత్త చట్టాన్ని ఆమోదించేందుకు బ్రిటన్ చట్ట సభ్యులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్