Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).
ఇంటర్నెట్ డెస్క్: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓపెన్హైమర్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అణుబాంబు (atomic bomb) సృష్టికర్త, శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే హైమర్ జీవితం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? అణుబాంబును ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? మళ్లీ ఆయనే దాన్ని ఎందుకు వ్యతిరేకించారు?
తాత ఇచ్చిన రాళ్లతో..
హైమర్ 1904, ఏప్రిల్ 22న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించాడు. అమ్మానాన్నలది జర్మనీ. చిన్నప్పటి నుంచే చురుకుగా, తెలివిగా ఉండే హైమర్ ఐదేళ్ల వయసులో తాతగారు ఇచ్చిన కొన్ని ప్రత్యేకమైన రాళ్లను పరిశీలిస్తూ, భూగర్భశాస్త్రం(జియాలజీ)పై ఇష్టం పెంచుకున్నాడు. మైక్రోస్కోప్ అంటే ఎంతో ఇష్టం. తన వయసు పిల్లలంతా ఆడుకుంటే.. హైమర్ మాత్రం నీటి బిందువుల్ని పరిశీలిస్తూ సూక్ష్మజీవుల గురించి తెలుసుకునేవాడు. గ్రీకు, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్.. ఇలా అనేక భాషలను నేర్చుకున్న అతడు.. చిన్నప్పుడే గ్రీకు వేదాంత గ్రంథాలు చదివేశాడు. ఆయా భాషల్లో కవిత్వం రాసేవాడు.
11 ఏళ్లకే ఉపన్యాసం..
భూగర్భశాస్త్రం మీద ఆసక్తితో అమెరికాలోని భూగర్భ శాస్త్రవేత్తలకు హైమర్ లేఖలు రాసేవాడు. తన రాతని చూసి వారు తనని బాలుడిగా గుర్తించి లెక్క చేయరేమోనని ఉత్తరాల్ని టైప్ చేసి పంపేవాడు. శాస్త్రవేత్తలు హైమర్ బాలుడని తెలియక న్యూయార్క్ మినరలాజికల్ క్లబ్ సభ్యునిగా చేసి, అక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించారు. అప్పటికి హైమర్ వయసు 11ఏళ్లు. అతడిని చూసిన శాస్త్రవేత్తలు ముందు ఆశ్చర్యపోయారు. స్టేజీపై కుర్చీలో కూర్చుంటే అతడి పాదాలు నేలకు తగల్లేదట. తర్వాత తన ఉపన్యాస ప్రతిభకు వారు ఆశ్చర్యపోయారు.
హిట్లర్ను బెదిరించేందుకు అణుబాంబు..
హార్వర్డ్లో రసాయనశాస్త్రం చదివిన హైమర్.. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి భూగర్భశాస్త్రంపై దృష్టిపెట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కేంబ్రిడ్జ్లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రూథర్ఫర్డ్, నీల్స్బోర్ల పర్యవేక్షణలో పరిశోధనలు జరిపాడు. కొన్నాళ్లకు అమెరికాకు తిరిగొచ్చి కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా చేరాడు. అప్పుడే యూరప్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
జర్మన్ నియంత హిట్లర్ అణుబాంబును తయారుచేస్తాడేమోనని అమెరికా అనుమానించింది. ఆయన కన్నా ముందే దాన్ని ఒక హెచ్చరికగా రూపొందించాలనుకుంది. అప్పటికే హైమర్ న్యూక్లియర్ సైన్సులో పరిశోధనలు ప్రారంభించాడు. దీంతో ఆయనను అమెరికా ప్రభుత్వం అణుబాంబు తయారీకై ‘మన్ హటన్ ప్రాజెక్టు’కు డైరెక్టరుగా నియమించింది. హైమర్ వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో కలిపి 4,500మంది నిపుణులతో అణుబాంబును తయారు చేశాడు. న్యూమెక్సికోలో ఓ ఎడారిలో తొలి అణుబాంబును పరీక్షించారు. అప్పుడు వెలువడిన కాంతిని చూసి ‘ఒకేసారి వేయి సూర్యుల కాంతి ఆకాశంలోకి ప్రసరిస్తే ఎంతో.. అంత దేదీప్యమానమైనది నా తేజస్సు’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటల్ని హైమర్ సంస్కృతంలో చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట..!
వినాశనానికి చలించి..
తన పర్యవేక్షణలో తయారైన అణుబాంబు జపానులోని హిరోషిమా, నాగసాకిలపై ప్రయోగించినప్పుడు జరిగిన ప్రాణనష్టానికి హైమర్ ఎంతగానో చలించిపోయారు. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఆయనకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేసిన సమయంలో ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఇకపై అణ్వస్త్రాల్ని తయారుచేయడానికి నేను వ్యతిరేకిని’ అని అందరి ముందు చెప్పారు. ఆ తర్వాతి కాలంలో అణ్వస్త్రాల నిషేధంపై ఆయన గళమెత్తారు. దీంతో 1954లో అమెరికా ప్రభుత్వం ఆయనపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేయడంతో పాటు విధానపరమైన నిర్ణయాల కమిటీల నుంచి ఆయనను తొలగించారు. ఒకదశలో వామపక్షవాదులతో హైమర్ దంపతులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
నెహ్రూ ఆఫర్ను తిరస్కరించి..
ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబా జీవితంపై రచయిత భక్తియార్ దాదాభాయ్ రాసిన పుస్తకాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ఆవిష్కరించారు. ఇందులో ఓపెన్హైమర్-హోమీబాబా మధ్య ఉన్న స్నేహాన్ని రచయిత ప్రస్తావించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓపెన్హైమర్ను హోమీ బాబా ఓ సారి కలిశారు. అప్పటినుంచి వారిద్దరూ స్నేహితులయ్యారు. హైమర్ సంస్కృతం కూడా నేర్చుకున్నారు. 1954లో హైమర్ అమెరికాలో భద్రతాపరమైన క్లియరెన్స్ కోల్పోయిన సమయంలో.. బాబా సూచన మేరకు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన్ను భారత్కు ఆహ్వానించారు. భారత పౌరసత్వం కూడా ఇస్తామని నెహ్రూ ఆఫర్ చేశారు. అయితే అందుకు హైమర్ అంగీకరించలేదు. అమెరికాలో తనపై వచ్చిన అభియోగాలన్నీ అవాస్తవమని రుజువయ్యేదాకా దేశాన్ని వీడబోనని ఆయన నిశ్చయించుకున్నారు. అంతేగాక, అలా దేశం విడిచి వెళ్లిపోతే తనపై ఉన్న అనుమానాలు మరింత బలపడుతాయని ఆయన భావించారు’’ అని రచయిత ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
హైమర్పై కేసులు నమోదు చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే 1965లో ఆయన గొంతు క్యాన్సర్ బారినపడ్డారు. కిమోథెరపీ చేయించినా తగ్గలేదు. 1967లో కోమాలో వెళ్లిన హైమర్ (63).. ఆ తర్వాత కొద్ది రోజులకే తుదిశ్వాస విడిచారు. కాగా.. కొన్ని దశాబ్దాల తర్వాత హైమర్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దును గతేడాది అమెరికా ప్రభుత్వం తొలగించింది. ఈ సందర్భంగా మంత్రి జెన్నిఫర్ గ్రాన్హోం మాట్లాడుతూ.. ‘‘అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి హైమర్ సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసింది. హైమర్ పట్ల అన్యాయంగా, పక్షపాతంగా వ్యవహరించారని ఆ తర్వాత సాక్ష్యాధారాలతో తేలింది. దీంతో ఆయన నిజాయితి, అచంచలమైన దేశభక్తి రుజువయింది’’ అని ఆమె కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్