ఆ దేశాల జాతీయ గీతాల్లో సాహిత్యమే లేదు
ఒక దేశం ప్రాముఖ్యతను, గుర్తింపును చాటిచెప్పడంలో జాతీయ గీతం కీలక పాత్ర పోషిస్తుంది. ‘జనగణమణ’అంటూ భారతీయులు, ‘ది స్టార్-స్పాంగిల్డ్ బ్యానర్’ అంటూ అమెరికన్లు, ‘హమరా సోనా బంగ్లా’ అంటూ బంగ్లదేశీయులు, ‘అడ్వాన్స్డ్ ఆస్ట్రేలియా ఫెయిర్’ అంటూ ఆస్ట్రేలియన్లు
ఒక దేశం ప్రాముఖ్యత, గుర్తింపును చాటి చెప్పడంలో జాతీయ గీతం కీలక పాత్ర పోషిస్తుంది. ‘జనగణమన’ అంటూ భారతీయులు, ‘ది స్టార్-స్పాంగిల్డ్ బ్యానర్’ అంటూ అమెరికన్లు, ‘హమరా సోనా బంగ్లా’ అంటూ బంగ్లదేశీయులు, ‘అడ్వాన్స్డ్ ఆస్ట్రేలియా ఫెయిర్’ అంటూ ఆస్ట్రేలియన్లు ఇలా ప్రతి దేశంలోని పౌరులు జాతీయ గీతాన్ని వివిధ సందర్భాల్లో ఆలపిస్తూ ఉంటారు. జాతీయ గీతం విన్నా.. ఆలపించినా ఆయా దేశాల పౌరుల మనసు దేశభక్తితో ఉప్పొంగుతుంది. ప్రపంచ వేదికలు, అంతర్జాతీయ క్రీడల్లో ఈ జాతీయ గీతాలు ఆయా దేశాలను ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే అందులోని సాహిత్యం ఆ దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తుంది. కానీ, కొన్ని దేశాల జాతీయ గీతాల్లో అసలు సాహిత్యమే లేదు. కేవలం సంగీతాన్నే జాతీయ గీతంగా భావించే ఆ దేశాలేవో చూద్దామా..!
స్పెయిన్.. కవాతు సంగీతమే జాతీయ గీతం
స్పెయిన్ జాతీయ గీతాన్ని ‘మార్చా రియల్’(రాయల్ మార్చ్) అని పిలుస్తారు. 1761లో మాన్యువల్ డి ఎప్సీనోసా అనే సంగీత కళాకారుడు ‘లా మార్చి గ్రానడెరా’(మార్చ్ ఆఫ్ ది గ్రాండీస్) పేరుతో పదాలు లేకుండా ఒక సంగీతాన్ని రూపొందించాడు. ఈ సంగీతాన్ని సైనికులు కవాతు చేస్తున్న సమయంలో ఆలపించేవారు. అయితే దీనిని ప్రసా చక్రవర్తి ఫెడ్రెరిక్-II రూపొందించారన్న వాదన ఉంది. ఈ సంగీతాన్ని 1770లో అప్పటి స్పెయిన్ రాజు ఛార్లెస్-III కవాతుకు అధికారిక సంగీతంగా ప్రకటించారు. ఆ తర్వాత 1833-68మధ్య స్పెయిన్ను పాలించిన ఇసబెల్లా-II ఈ సంగీతాన్ని జాతీయగీతంగా మార్చేశారు. గతంలో కొందరు ఈ జాతీయ గీతానికి సాహిత్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ, వాటికి అధికారిక గుర్తింపు రాలేదు.
గతంలో ఉన్న సంగీతాన్ని 1990ల్లో పెరెజ్ కాసస్ అనే సంగీత కళాకారుడు 52 సెకన్ల నిడివితో పునరుద్ధరించాడు. దీనిపై అతడికి పేటెంట్ హక్కులు ఉండటంతో స్పెయిన్ ప్రభుత్వం అతడికి అప్పట్లోనే రూ.6.8కోట్లు ఇచ్చి వినియోగ హక్కులు తీసుకుంది. అయితే దీనిని మూడు వర్షెన్లలో ఆలపిస్తుంటారు. స్పెయిన్ రాజును గౌరవించే సమయంలో పూర్తి సంగీతాన్ని, స్పెయిన్ అధ్యక్షుడిని.. ప్రముఖులను గౌరవించే సమయంలో నిడివి తక్కువ ఉండే వర్షెన్లను ఆలపిస్తారు.
బోస్నియా అండ్ హెర్జె గొవినా.. అందరినీ సంతృప్తి పర్చాలని
బోస్నియా యుద్ధం తర్వాత 1995లో డేటాన్ ఒప్పందం జరిగింది. బోస్నియా అండ్ హెర్జెగొవినా జాతీయ చిహ్నాలు, గీతం ఆ దేశంలోని అన్ని జాతుల వారిని ప్రతిబింబించేలా ఉండాలన్నది ఈ ఒప్పందంలోని ఒక నిబంధన. ఆ సమయంలో బోస్నియా జాతీయ గీతం ‘జెడ్నా సి జెడినా’ సాహిత్యంలో అలాంటిది జరగలేదు. అందులో అన్ని జాతులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ గీతాన్ని అక్కడి సెర్బ్, క్రోట్ సామాజిక వర్గాలు వ్యతిరేకించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ఈ దేశానికి కేవలం సంగీతంతో కూడిన కొత్త జాతీయ గీతాన్ని రూపొందించాలని నిర్ణయించింది.
అలా 1999 జూన్ 25న ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం జాతీయ గీతాన్ని బోస్నియా అండ్ హెర్జెగొవినాకు అధికారిక గీతంగా ప్రకటించింది. దీనిని బోస్నియాలోని సెర్బ్ వర్గానికి చెందిన సంగీత కళాకారుడు డుసన్ సెస్టిక్ రూపొందించారు. సాహిత్యం లేని ఈ జాతీయ గీతాన్ని ‘ఇంటర్మెకో’ అని కూడా పిలుస్తారు. కానీ దీనికి అధికారిక గుర్తింపు లేదు. 2007 నుంచి చాలా మంది తమ జాతీయ గీతానికి సాహిత్యం జోడించాలని విఫల యత్నం చేశారు. ఈ జాతీయ గీతం రూపకర్త డుసన్ కూడా 2008లో సాహిత్యం అందించారు. అయితే దీనిపై వివాదాలు నెలకొనడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో పలు చోట్ల అనధికారికంగా జాతీయ గీతానికి సాహిత్యం వాడుతున్నారు.
శాన్ మారినో.. ఇన్నో నేషనల్
యూరప్ ఖండంలో ఉన్న శాన్ మారినో దేశం జాతీయ గీతంలోనూ సాహిత్యం లేదు. 1894 వరకు ఈ దేశానికి సాహిత్యంతో ‘గిబిలంటీ డీయామోర్ ఫ్రాటెర్నొ’అనే జాతీయం గీతం ఉండేది. ఆ తర్వాత ఇటలీకి చెందిన సంగీత కళాకారుడు ఫెడరికో కొన్సొలో సాహిత్యం లేకుండా రూపొందించిన ‘ఇన్నో నేషనల్’ను శాన్ మారినో ప్రభుత్వం జాతీయ గీతంగా ప్రకటించింది. సాధారణంగా జాతీయ గీతాన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆలపిస్తారు. కానీ, శాన్ మారినో నగర వీధుల్లో ప్రతి పర్వదినంలో సైనిక బలగాలు జాతీయ గీతాన్ని ఆలపిస్తాయి.
కొసొవో.. పోటీ పెట్టి మరీ
1877లో కొసొవో ప్రాంతం ఒట్టోమన్ రాజ్యంలో కార్యనిర్వాహక ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత 1990 నుంచి 1999 వరకు అనధికార స్వతంత్ర దేశంగా కొసొవో కొనసాగింది. ఆ సమయంలో అల్బానియా జాతీయ గీతాన్నే తమ జాతీయ గీతంగా మలుచుకున్నారు. అల్బానియా జాతీయ చిహ్నాలనే తమ చిహ్నాలుగా కొనసాగించారు. అయితే 2008 ఫిబ్రవరి 17న కొసొవోకు అధికారికంగా స్వతంత్రం లభించింది. దీంతో తమ దేశానికి ఒక నూతన జాతీయ గీతం ఉండాలని భావించి.. బహిరంగ పోటీ నిర్వహించింది. ఎవరి సంగీతమైతే జాతీయ గీతంగా ఎంపికవుతుందో వారికి 10వేల పౌండ్లు నగదు బహుమతి ప్రకటించింది. కాగా అదే ఏడాది జూన్ 11న ‘యూరప్’ పేరుతో మెండి మెంగ్జికి రూపొందించిన సంగీతం జాతీయ గీతంగా ఎంపికైంది. 2000 సంవత్సరంలో రాఫ్ దోమీ అనే సంగీతకళాకారుడు రూపొందించిన ‘కుర్ కా రా కుష్త్రిమి అండ్ కొసొవో’సంగీతాన్ని అప్పటి దేశాధ్యక్షుడు ఇబ్రహీం రుగొవా ప్రతిపాదించారు. ఈ గీతంలోని సాహిత్యాన్ని అల్బేనియన్ భాషలో రచించారు. కానీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్