Phailin to Amphan: దశాబ్ది కాలంలో.. విధ్వంసం సృష్టించిన తుపాన్లు..!
గడిచిన దశాబ్దంలో భారత్లో సంభవించిన కొన్ని తుపానులు భారీ విధ్వంసం (Deadliest Cyclones) సృష్టించాయి. ప్రాణనష్టంతోపాటు భారీ స్థాయిలో ఆస్తినష్టం కూడా వాటిల్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిఏడాది భారత్లో దాదాపు 5 నుంచి 6 తుపాన్లు సంభవిస్తుండగా అందులో రెండు, మూడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో అనేక తుపాన్లు భారత్ తీరాన్ని తాకినప్పటికీ.. అందులో కొన్ని మాత్రం చాలా బీభత్సం (Deadliest Cyclones) సృష్టించి ఎంతో నష్టాన్ని కలిగించాయి. తాజాగా బిపోర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) అత్యంత నష్టం కలిగించే సామర్థ్యం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో తుపాను ముప్పు ఉన్న తీర ప్రాంతాల నుంచి 74వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరుణంలో గడిచిన దశాబ్దంలో భారీ విధ్వంసం సృష్టించిన తుపాన్లను ఓసారి గుర్తుచేసుకుంటే..
తౌక్తే తుపాను (2021): భారత్లో కొవిడ్ రెండోదశ విజృంభిస్తున్న సమయంలో వచ్చిన తౌక్తే తుపాను (Cyclone Tauktae).. గుజరాత్లోని దక్షిణ కోస్తా తీరాన్ని 2021, మే 21న తాకి అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి. భారత్ పశ్చిమ కోస్తా తీరంలో గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన తుపాన్లలో ఇదే బలమైనదిగా నిలిచింది. దీని ప్రభావానికి గుజరాత్లో 100 మంది ప్రాణాలు కోల్పోగా.. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలకు తీవ్రనష్టాన్ని కలిగించింది.
ఆంపన్ తుపాన్ (2020): బంగాళాఖాతంలో 1999 తర్వాత (1999 Odisha cyclone) ఏర్పడిన తొలి సూపర్ సైక్లోన్ (Cyclone Amphan) ఇదే. 2020 మే 20న పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్లో తీరాన్ని తాకింది. సుమారు 120-190 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లూ నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కోల్కతాలో తీవ్ర నష్టం జరిగింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం.. అత్యంత వినాశకర తుపాన్లలో ఒకటి అని. భారత్కు సుమారు 14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. భారత్, బంగ్లాదేశ్లలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫని తుపాను (2019): తూర్పు కోస్తా ప్రాంతంలోని పూరీ వైపు 2019 మే 3న ఫణి తుపాను (Cyclone Fani) దూసుకొచ్చింది. తీరం దాటే సమయంలో గంటకు 175కి.మీ వేగంతో గాలులు వీచాయి. తుపాను దాటికి 64 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది. వ్యవసాయంతోపాటు కమ్యూనికేషన్, కరెంటు, తాగునీటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వార్దా తుపాను (2016): వార్దా తుపాను (Cyclone Vardah) 2016 డిసెంబర్ 12న చెన్నై దగ్గర్లో తీరం దాటింది. ఇది అతి తీవ్ర తుపానుగా రికార్డయ్యింది. దీని ప్రభావంతో తమిళనాడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చెన్నైతోపాటు సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అయితే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంతో ముప్పు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమైంది.
హుద్హుద్ తుపాను (2014): ఆంధ్రప్రదేశ్తోపాటు ఒడిశా రాష్ట్రాలను వణికించిన హుద్హుద్ తుపాను (Cyclone Hudhud) 2014 అక్టోబర్ 12న తీరాన్ని తాకింది. తుపాను కారణంగా 124 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు, పవర్ గ్రిడ్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం, వరదల కారణంగా విశాఖ నగరం నాశనమయ్యింది.
ఫైలిన్ తుపాను (2013): ఒడిశాలోని గోపాల్పుర్లో తీరాన్ని తాకిన ఫైలిన్ తుపాను (Cyclone Phailin) లక్షల మందిపై ప్రభావం చూపింది. 2013 అక్టోబర్ 12న తీరాన్ని తాకింది. ఆ సమయంలో రికార్డు స్థాయిలో గంటకు 200కి.మీ వేగంతో భీకర గాలులు వీచాయి. ఆ సమయంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలోని 18 జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగారు. అయినప్పటికీ వ్యవసాయంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసింది.
ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుపానుల్లో 8శాతం భారత్లోనే చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. 9 రాష్ట్రాల్లో 7516 కి.మీ మేర ఉన్న ఈ తీరప్రాంతంలో సుమారు 32 కోట్ల జనాభా నివసిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్తోపాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ తుపాన్లకు ప్రభావితమవుతున్నాయి. అయితే, ఈ తుపాన్లు అధికంగా బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయి. అయినప్పటికీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అరేబియా సముద్రంలోనూ తరచూ సంభవిస్తున్న తుపాన్లు అధిక తీవ్రతను కలిగి ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్