Herd Immunity: హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కానట్లేనా..?
హెర్డ్ ఇమ్యూనిటీని ఎలా సాధించాలని ఆలోచించడం కన్నా వైరస్తో కలిసి ఎలా జీవించాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిందేనని కొందరు ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వైరస్తో కలిసి జీవించడంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ (Herd Immunity) ఒక్కటే పరిష్కారమని నిపుణులు మొదట్లో అంచనా వేశారు. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ పొందడం వల్ల లేదా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడం వల్ల ఇది సాధించవచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ రూపాంతరాలు చూస్తుంటే హెర్డ్ ఇమ్యూనిటీని పొందడం ఇప్పట్లో సాధ్యం కానట్లే తెలుస్తోంది. దీంతో హెర్డ్ ఇమ్యూనిటీని ఎలా సాధించాలని ఆలోచించడం కన్నా వైరస్తో కలిసి ఎలా జీవించాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిందేనని కొందరు ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
‘ప్రపంచానికి అతి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ మహమ్మారి వేగంగా మార్పులకు గురవుతోంది. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న డెల్టా వంటి కొత్త రకాలతో పలు దేశాలు వణికిపోతున్నాయి. ఇలా అతివేగంగా ఉత్పరివర్తనం చెందుతున్న కరోనా వైరస్ను చూస్తుంటే హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పటికీ సాధించలేమని తెలుస్తోంది. ముఖ్యంగా సార్స్-కోవ్-2 విషయంపై హెర్డ్ ఇమ్యూనిటీ అనే పదాన్ని కూడా ప్రస్తావించడం మానుకోవాలి’ అని యూనివర్సిటీ ఆఫ్ విట్వాటర్స్రాండ్కు చెందిన ప్రజారోగ్య, వ్యాక్సినాలజీ విభాగాధిపతి షబీర్ ఏ మధి సూచించారు. అంతేకాకుండా మన జీవితకాలంలో కొవిడ్-19 విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చని.. దీని వ్యాప్తి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సవాల్గా మారిన కొత్త వేరియంట్లు..
కరోనా వైరస్ను నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో కనీసం 67శాతం మందికి వ్యాక్సిన్ వేసినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుందని షబీర్ ఏ మధి వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డెల్టా వంటి శక్తివంతమైన రకాలను ఎదుర్కోవాలంటే 84శాతం మంది ఇమ్యూనిటీని పొందాలి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సరఫరాలో దేశాల మధ్య అసమానతలు నెలకొనడం కూడా మరో సవాల్గా మారింది. కొన్ని పేద దేశాల్లో ఇప్పటివరకు ఒక శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ లభించగా.. ప్రపంచ సరాసరి 27శాతానికి చేరుకుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఇలా కరోనాపై యావత్ ప్రపంచం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే ఇప్పట్లో కష్టంగానే కనిపిస్తోంది. అలా అని కొవిడ్ నియంత్రణ కోసం దేశాలు సరిహద్దులను మూసివేయడం ఎక్కువ కాలం చేయలేవు. ఒకవేళ వ్యాక్సిన్ల నుంచి ఇమ్యూనిటీ పొందినా అవి కొంతకాలం మాత్రమే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం కరోనా వైరస్పై హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమేనని.. అందుచేత, ఆ విషయంపై మాట్లాడడం కంటే వైరస్తో కలిసి ఎలా జీవించాలనే అంశాలపై దృష్టి సారించాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.
80-90శాతం మందికి వస్తేనే..
హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే మొత్తం జనాభాలో 60 నుంచి 70శాతం మంది ఇమ్యూనిటీ సాధిస్తే సరిపోతుందని తొలుత నిపుణులు అంచనా వేశారు. కానీ, కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ దీనిని 80 నుంచి 90శాతానికి పెంచిందని అమెరికాలోని అంటువ్యాధుల సొసైటీ పేర్కొంది. ఇప్పటికే అమెరికాలో 60శాతం మంది కనీసం ఒకడోసు తీసుకోగా.. 50శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందారు. అయినప్పటికీ వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో హెర్డ్ ఇమ్యూనిటీపై ఇండోనేసియా కూడా పునరాలోచనలో పడింది. కేవలం వ్యాక్సిన్ అందించడం ద్వారా దీన్ని పొందలేమని.. అందరికీ అందించినా వైరస్ వ్యాప్తి కొనసాగుతుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు కొవిడ్ వ్యవహారాలు చూస్తోన్న ఇండోనేసియా మంత్రి పేర్కొన్నారు.
వైరస్లతో కలిసి జీవించడమే మార్గం..
కరోనా విషయంలో వ్యాక్సిన్ అందించడం ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల ఇమ్యూనిటీ పొందాలనుకుంటే అనవసర కేసులు, మరణాలను చవిచూడాల్సి వస్తుందని ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రభావశీలత కలిగిన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం గొప్ప విజయమే అయినప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుచేత హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కన్నా వైరస్తో ఎలా కలిసి జీవించాలని మాట్లాడుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు