America : అమెరికాలో ప్రజలకు డబ్బులు పంచే రాష్ట్రం.. ఒక్కో వ్యక్తికి వెయ్యి డాలర్లు!
1982 నుంచి అలస్కా ప్రజలు ఏటా ‘అలస్కా శాశ్వత నిధి’ నుంచి కొంత మొత్తాన్ని పొందుతున్నారు. ఒక్కో వ్యక్తికి సగటున వెయ్యి డాలర్ల వరకు అందుతోంది.
అలస్కా.. అమెరికాలోని (America) అతిపెద్ద రాష్ట్రం. వెంట్రుకల ఎగుమతి, చేపల పెంపకం, బంగారు నిక్షేపాల తవ్వకం, చమురు వెలికితీత ద్వారా ఈ రాష్ట్రం ఆదాయాన్ని గడిస్తోంది. ప్రధానంగా చమురు ద్వారా ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. అయితే చమురు విలువ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. పైగా చమురు పరిమిత వనరు కావడంతో ఎప్పుడో ఒకసారి ఆ నిల్వలు నిండుకోవడం ఖాయం. అందుకు పరిష్కారంగా ఈ రాష్ట్రంలో ఒక నిధి ఏర్పాటు చేశారు. ఏంటా నిధి? అది ప్రజలకు ఎందుకు పంచుతున్నారో తెలుసుకోండి.
సోవియట్ యూనియన్ నుంచి కొని..
అమెరికా 1867లో సోవియట్ యూనియన్ నుంచి అలస్కాను 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 1896 వరకు ఇక్కడ వెంట్రుకల ఎగుమతులు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఆ తరువాత క్లోన్డైక్ నది సమీపంలో బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయి. 1960 నాటికి ఈ రాష్ట్రం ఆదాయం మత్స్య సంపదపై ఆధారపడింది. అప్పట్లో వార్షిక బడ్జెట్ 100 మిలియన్ డాలర్లుగా ఉండేది.
వెలుగులోకి భారీ చమురు క్షేత్రం
1962 నాటికి పరిస్థితి మారిపోయింది. ఈ రాష్ట్రంలో భారీ చమురు క్షేత్రం బయటపడింది. ప్రూధో బేలో సుమారు 13 బిలియన్ బ్యారెళ్లను తోడుకోవచ్చనే అంచనాకు వచ్చారు. వెంటనే చమురు కంపెనీలకు ఆ భూములను లీజుకివ్వగా 1969లో ఏకంగా 900 మిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చింది.
ఆ గవర్నర్ రాకతో..
ప్రూధ్ బే చమురు నిక్షేపాలు, ట్రాన్స్ అలస్కా పైప్లైన్ వల్ల అలస్కా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 1974లో జే హామండ్ గవర్నర్గా ఎన్నికయ్యాడు. చమురు నిల్వలు ఏనాటికైనా తరిగిపోవచ్చనే ఆలోచనతో భవిష్యత్ తరాల కోసం ఆయన 1976లో చమురు ద్వారా వచ్చే ఆదాయంతో ‘అలస్కా శాశ్వత నిధి’ని ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం ఆయిల్పై వచ్చే రాయల్టీలో 25శాతం ప్రజా పొదుపు నిధిలోకి వెళ్లాలి. అలా ఆ నిధిలోకి వెళ్లిన మొత్తం 2018 నాటికి 65 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఆరేళ్ల తరువాత ప్రజా పొదుపు నిధిలో నుంచి కొంత భాగాన్ని అలస్కా ప్రజలకు పంచే ఏర్పాటు చేశారు. ఎవరైతే ఏడాది కాలంగా అలస్కాలో ఉంటున్నారో వారికి మాత్రమే ఈ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలే ఈ నిధికి రక్షకుల్లా మారుతారని ఈ పథకాన్ని ప్రతిపాదించిన నేతల అభిప్రాయం. పైగా, ఈ ప్రయోజనం అందరికీ సమానంగా అందడం వల్ల తక్కువ ఆదాయం పొందే అలస్కా ప్రజలకు ఒక ఆర్థిక భద్రత ఉంటుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ వెయ్యి డాలర్లు
1982లో అర్హత కలిగిన ప్రతి స్థానికుడు వెయ్యి డాలర్ల చెక్కు పొందాడు. ఆ తరువాత నుంచి చివరి ఐదు సంవత్సరాల శ్వాశ్వత నిధి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి డివిడెండ్ను చెల్లిస్తున్నారు. 1984లో ‘ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఐఎస్ఈఆర్) ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం ఈ పథకం పట్ల 60 శాతం అలస్కా ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తేలింది. 29 శాతం మంది నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 10 శాతం మంది ప్రజలు దీనిని వ్యతిరేకించారు.
ప్రభుత్వం పంచిన డబ్బుతో ప్రజలు ఏం చేశారనే విషయంపై కూడా ఈ సంస్థ సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చిన నగదులో 45 శాతం ఆహారం, దుస్తులు, వసతిపై ఖర్చు చేశారు. 20 శాతం దాచుకొని, 20 శాతం ఫెడరల్ ట్యాక్సులు చెల్లించారు. 5 శాతం అప్పులు చెల్లించడానికి, 10 శాతం విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి వెచ్చించారు.
తగ్గిన పేదరికం
అలస్కా రాష్ట్రంలో ఏటా అక్టోబరు, నవంబరు మాసాల్లో డబ్బు పంపిణీ జరుగుతుంది. ‘ఆలస్కా శాశ్వత నిధి’ పంపకం కారణంగా ఇక్కడ పేదరికం తగ్గుముఖం పట్టింది. ఈ పథకం వల్ల ఏటా 15 వేల నుంచి 25 వేల అలస్కాన్లు పేదరికం నుంచి బయటపడుతున్నట్లు వెల్లడైంది.
పథకానికి కొన్ని అర్హతలు
- ఇతర రాష్ట్రం లేదా దేశానికి చెందిన వారు కాకూడదు.
- అలస్కాలోనే శాశ్వతంగా నివాసం ఉండాలి.
- ఏదైనా కేసులో దోషిగా ఉండరాదు.
- ఏడాదిలో కనీసం 180 రోజులు అలస్కాలోనే నివసించాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్