Deep sea mining : సముద్ర గర్భంలో అపార ఖనిజ సంపద.. ‘డీప్ సీ మైనింగ్’తో వెలికితీయొచ్చు!
సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమే కాదు అరుదైన ఖనిజ సంపద దాగి ఉంది. అందుకే ఇటీవల కొన్ని దేశాలు ‘డీప్ సీ మైనింగ్’పై (Deep sea mining) దృష్టి సారించాయి.
ఖనిజాలు, లోహాల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. కానీ, భూమిలో అవి లభించే శాతం తక్కువగా ఉంటుంది. అందుకే పరిశోధకులు సముద్ర గర్భంపై దృష్టి సారించారు. అందులోని విలువైన సంపదను వెలికి తీసే ఉద్దేశంతో ‘డీప్ సీ మైనింగ్’ను (Deep sea mining) తెరపైకి తీసుకొచ్చారు. దాని విశేషాలు తెలుసుకోండి.
ఏంటీ ‘డీప్ సీ మైనింగ్’?
సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు, లోహాలు ఉన్నాయి. ఖనిజాలు అత్యధిక శాతం ఉన్న పాలిమెటాలిక్ నోడ్యూల్ వెలికితీత, సల్ఫైడ్ నిక్షేపాలను తవ్వడం, రాతి నుంచి కోబాల్ట్ క్రస్ట్ను తొలగించడం వంటి మైనింగ్ పద్ధతుల ద్వారా వాటిని వెలికితీయొచ్చు. ఇలా మైనింగ్ చేయడం వల్ల నికెల్, కోబాల్ట్, మాంగనీస్ వంటి అరుదైన లోహాలు లభిస్తాయి. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో వాటిని పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు. కంప్యూటర్లు, సెల్ఫోన్లు, పునరుత్పాదక ఇంధనాలు, బ్యాటరీలు రూపొందించాలంటే ఈ లోహాలు అవసరం.
అనేక రకాలుగా అన్వేషణ
సముద్రం సహజంగానే కొన్ని వేల అడుగుల లోతు ఉంటుంది. అంత లోతులో దాగున్న ఖనిజాలు, లోహాలు ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు వాక్యూమ్ క్లీనర్ తరహాలో భారీ పంపులను సముద్రం అడుగు భాగానికి పంపించి వాటి ద్వారా నిక్షేపాలను వెలికితీయాలని చూస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్నాయి. అంటే, సముద్రంలోకి రోబోలను పంపిస్తే అవి నోడ్యూల్స్ను మాత్రమే పట్టుకొని బయటకు తీసుకొస్తాయి. మరికొన్ని కంపెనీలు సముద్రం అట్టడుగు భాగం వరకు వెళ్లి తవ్వగలిగే యంత్రాలను రూపొందిస్తున్నాయి. ఈ పద్ధతులు విజయవంతం అయితే కొన్ని దేశాలు భారీగా లాభపడతాయి. అందుకే పరిశోధనల కోసం అపరిమితంగా ఖర్చు చేసేందుకు అవి వెనుకాడటం లేదు.
పర్యావరణవేత్తల ఆందోళన
ఇప్పటికే భూమిపై జరుపుతున్న తవ్వకాలతో పర్యావరణానికి చాలా నష్టం వాటిల్లుతోంది. సముద్రంలో కూడా తవ్వకాలు సాగిస్తే మానవులతో సహా అనేక జీవజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడలిలో మైనింగ్ వల్ల వెలువడే శబ్దాలు, ప్రకంపనలు, కాంతి మత్స సంపదకు ఇబ్బందులు సృష్టిస్తాయని చెబుతున్నారు. మైనింగ్ వల్ల కొన్ని రకాల ఇంధనాలు, రసాయనాలు కూడా నీటిలో కలిసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వెలువడిన వ్యర్థాలను తిరిగి సముద్రంలోకి విడుదల చేయడం వల్ల పగడపు దీవులు, స్పాంజెస్ ఇతర జీవులను ప్రమాదంలోకి నెట్టినట్లవుతుంది.
వ్యతిరేకిస్తున్న దేశాలు.. కంపెనీలు
సముద్రంలో 200 మీటర్ల లోతుకు వెళ్లగానే చీకటి కన్పిస్తుంది. ఇలా చీకటిగా ఉండే భాగం దాదాపు అన్ని సముద్రాల్లో అధికంగా ఉంటుంది. ఆ భాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపే పూర్తి శాస్త్రీయ సమాచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అక్కడ ఉండే జీవులకు హాని కలిగిస్తే.. మానవులకు కూడా ఇబ్బందులు ఎదరయ్యే ప్రమాదముంది. అందుకే డీప్ సీ మైనింగ్కు తాము వ్యతిరేకమని ఇప్పటికే చాలా దేశాలు ప్రకటించాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, న్యూజిలాండ్, కోస్టారికా దేశాలు డీప్ సీ మైనింగ్ను బలంగా వ్యతిరేకిస్తూ తమ చట్టసభల్లో తీర్మానాలు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, రెనాల్ట్, శామ్సంగ్, టెస్లా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు సైతం డీప్ సీ మైనింగ్ ద్వారా వెలికి తీసిన ఖనిజాలు, లోహాలను తమ ఉత్పత్తుల్లో వాడబోమని గతంలోనే ప్రకటించాయి.
సై అంటున్న నార్వే
డీప్ సీ మైనింగ్కు నార్వే ఉవ్విళ్లూరుతోంది. దాదాపు 4 వేల మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టడానికి ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది. సముద్రంలో 2.81లక్షల చదరపు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టాలని నార్వేజియన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్ నిల్వలపై ఆధారపడకుండా తాము కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నామని నార్వే తన చర్యను సమర్థించుకుంటోంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెబుతోంది.
మన దేశంలోనూ ‘బ్లూ ఎకానమీ’
సముద్ర గర్భంలో దాగిన అపరిమిత సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వినియోగించుకొనేందుకు భారత ప్రభుత్వం 2021లోనే ప్రణాళిక రచించింది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం రూ.4,077 కోట్ల వ్యయంతో ‘డీప్ ఓషన్ మిషన్’ చేపట్టింది. 7,517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1,382 ద్వీపాలున్న మన దేశం సాగర గర్భంలోని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ‘డీప్ ఓషన్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. డీప్ సీ మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, సముద్ర వాతావరణ మార్పులపై అధ్యయనం, జీవ వైవిధ్య రక్షణకు చర్యలు, సముద్ర లోతుల్లో సర్వే, ఇంధనాలు- తాగునీటి సేకరణ, ప్రత్యేక మెరైన్ కేంద్రాలు వంటి ఆరు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్