Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా.. హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో

Published : 27 Feb 2022 15:17 IST

దిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా.. హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా మూడో విమానం దిల్లీకి చేరింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు 709 మంది చేరుకున్నారు. భారత్ నుంచి రొమేనియాకు రెండు విమానాలు పంపగా.. 219 మందితో శనివారం తొలి విమానం ముంబయి చేరుకుంది. రొమేనియా నుంచి 250 మందితో, బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలుదేరిన రెండు విమానాలు దిల్లీకి చేరుకున్నాయి. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని