ఆ టీవీ కార్యక్రమాలు ప్రసారమవకూడదు
టీవీలలో ప్రతిరోజూ మనం చూస్తున్న అనేక కార్యక్రమాలు ప్రసారమే కాకూడదని సుప్రీం చురకలు వేశారు.
ప్రెస్ కౌన్సిల్కు సుప్రీం చురకలు
దిల్లీ: ప్రజలపై డిజిటల్ మీడియా ప్రభావం అమితంగా ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నియంత్రణ ప్రమాణాల నిర్దేశంలో డిజిటల్ మీడియాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. డిజిటల్ మాధ్యమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది.
డిజిటల్ మాధ్యమాలకు ప్రమాణాలు
సుదర్శన్ టీవీ అనే ఓ ప్రైవేటు టీవీ ఛానల్కు సంబంధించిన కేసు సందర్భంగా.. డిజిటల్ మాధ్యమాలకు ప్రమాణాలను నిర్ణయించే అంశం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం సుప్రీం కోర్టుకు ఓ అఫిడవిట్ను సమర్పించింది. ‘‘ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలను గురించి మార్గదర్శకాలు, తీర్పులు స్పష్టంగానే ఉన్నాయి. కాగా ప్రజలపై డిజిటల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతోంది. వార్తల ప్రచారంలో దానికి గల వేగం, శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం మొదట డిజిటల్ మీడియాపై దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాము’’ అని దానిలో పేర్కొంది. అంతేకాకుండా డిజిటల్ మాధ్యమాల విషయమై అమికస్ క్యూరీని నియమించాల్సిందిగా సుప్రీంను కోరింది.
సుదర్శన్ టీవీలో ప్రసారమయ్యే ఓ కార్యక్రమం, ఓ వర్గానికి చెందిన వారిని కించపర్చేదిగా ఉందని, ఆ షోను నిలిపి వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ విచారణలో.. ప్రత్యేకించి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై ముద్ర వేయరాదని కోర్టు వెల్లడించింది.
అవధులు లేని మీడియా తీరు
టీఆర్పీ కోసం, సంచలనం సృష్టించటం కోసం టీవీ ఛానెళ్లు పోటీ పడటంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసును కవర్ చేయటంలో అవధులు లేని మీడియా తీరుపై కోర్టు విచారం వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని.. న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు జవాబుగా ప్రసార మాధ్యమాల్లో విధివిధానాలు సక్రమంగానే అమలవుతున్నాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. నిబంధనలు అతిక్రమించిన ఏ ఛానల్ కైనా రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని సంస్థ తెలిపింది. కాగా, అదే నిజమైతే టీవీలలో రోజూ మనం చూస్తున్న అనేక కార్యక్రమాలు ప్రసారమే కాకూడదని జస్టిస్ డీవై చంద్రచూడ్ పీసీఐకి చురకలు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.