కశ్మీర్‌లో 4జీ సేవల పునురుద్ధరణకు కమిటీ

జమ్మూ-కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వాన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది......

Updated : 11 May 2020 19:50 IST

కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వాన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలు ప్రస్తుతం పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సేవల్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో జమ్మూకశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శికి కూడా చోటు కల్పించాలని చెప్పింది. ఈ మేరకు పలు స్వచ్ఛంద, మీడియా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎన్‌వీ.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు