భావి తరాలపై భారం పడే దుబారాలొద్దు
‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. దుబారా చేయొద్దు. నిధులను న్యాయబద్ధంగా ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలు తలకు మించిన భారాన్ని మోసే పరిస్థితి రాకుండా చూడాలి.
ప్రజావసరాలే ప్రాతిపదిక కావాలి
నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని మోదీ హితవు
వచ్చే 25 ఏళ్లకు విజన్ రూపొందించాలని సీఎంలకు పిలుపు
11 మంది ముఖ్యమంత్రుల గైర్హాజరు
ఈనాడు, దిల్లీ: ‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. దుబారా చేయొద్దు. నిధులను న్యాయబద్ధంగా ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలు తలకు మించిన భారాన్ని మోసే పరిస్థితి రాకుండా చూడాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించని చాలా దేశాలు ఇప్పుడు ఆ పరిణామాలను అనుభవిస్తున్నాయి. అందువల్ల మనం ఏం చేసినా.. ఏ ప్రణాళిక రూపొందించినా భవిష్యత్తు తరాలపై భారం పడకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. 2047 నాటికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్ను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం దిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో ఆయన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పాలనాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశానికి 11 మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు రాకపోవడం ఇదే ప్రథమం. ప్రధాని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ, ముగింపోపన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ సమావేశంలో పాల్గొన్న అందరిపైనా ఉంది. అందుకోసం మనం ఉమ్మడి విజన్, వ్యూహంతో వెళ్లాలి. వికసిత్ భారత్ లక్ష్యం ఉన్నది వ్యక్తులకో, కొన్ని సమూహాలకో కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల లక్ష్యం కాబట్టి దాని సాధనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. అందుకు ఉదాహరణ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమే.
దేశవ్యాప్తంగా వివిధ సూచికల్లో వెనుకబడిన 112 జిల్లాలను ఎంపిక చేసి వాటిని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి. అలాగే అత్యంత వెనుకబడిన 500 బ్లాక్లను పైకి తీసుకురావడానికి చేపట్టిన ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమంపై రాష్ట్రాలు మంచి దృష్టి పెట్టి పని చేస్తున్నాయి. ఈ బ్లాక్లను వివిధ కొలమానాల్లో రాష్ట్ర సగటుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. తద్వారా జాతీయ సగటు పెరుగుతుంది. ఇప్పటివరకూ 50వేల అమృత్ సరోవర్లను నిర్మించారు. మిగిలిన 50వేల సరోవర్ల పని పూర్తి చేయాలి. జిల్లాకు 75 కాకుండా ఒక్కో బ్లాక్లో 75 సరోవర్లను నిర్మించేందుకు ప్రయత్నించాలి. రాష్ట్రాలు అంతర్గత పోటీతత్వంతో పని చేయాలి. జిల్లాలు, బ్లాక్ల మధ్య పోటీ ఉండాలి. బాగా పని చేసే వాటిని ప్రోత్సహించాలి. కేవలం జాతీయ స్థాయిలో విజన్ ఉంటే సరిపోదు. రాష్ట్ర, జిల్లా స్థాయి విజన్ ఉండాలి. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో బలమైన టీమ్లను ఏర్పాటుచేసి నీతి ఆయోగ్తో కలిసి పని చేసేలా చూడాలి. ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్ను రూపొందించుకుని కేంద్రంతో కలిసి పని చేయాలి. దూకుడు ప్రదర్శించాలి. కార్మిక శక్తికి గౌరవమివ్వాలి. అప్పుడే అది నాణ్యమైన ఉత్పత్తినిస్తుంది. 2025కల్లా టీబీని నిర్మూలించాలి. రాష్ట్రాలు గతిశక్తి పోర్టల్ను ఉపయోగించుకోవాలి. ఏ లక్ష్యం సాధించాలన్నా సుపరిపాలన ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఒక నెల ముందుకు జరిపింది కాబట్టి కేంద్రం నుంచి ఏం వస్తాయన్నది రాష్ట్రాలకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి బడ్జెట్లను సరిగా ఉపయోగించుకోవాలి. తొలి మూడు నెలల్లోనే పనులు మంజూరు చేసి మొదలు పెట్టాలి. లేదంటే వర్షాకాలం 3 నెలల సమయం వృథా అవుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
11 మంది ముఖ్యమంత్రుల గైర్హాజరు
ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశానికి 11మంది మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఇందులో కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, నీతీశ్ కుమార్, మమతా బెనర్జీ, అశోక్ గహ్లోత్, ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, బీరేన్ సింగ్ ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు హాజరయ్యారు. మిగిలిన వారంతా భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఉన్నారు. ఇది సాధారణమేనని, గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు రాని సందర్భాలున్నాయని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారు రాకపోయినా కేంద్రం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. తాము స్టేట్ సపోర్ట్ మిషన్ ఏర్పాటు చేశామని, దీనిద్వారా అన్ని రాష్ట్రాల్లో నీతి ఆయోగ్ తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ‘భారత్ ఇప్పుడు టేకాఫ్ దశలో ఉంది. జనాభాలో ప్రపంచంలో తొలి స్థానానికి చేరిన మన దేశం మరో రెండేళ్లలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకోబోతోంది’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ఎజెండాలోని 8 అంశాలపై ముఖ్యమంత్రులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
ముస్లింల రిజర్వేషన్పై కార్టూన్ వీడియో
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్