Facebook Love: అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు
భారత్ నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన వివాహిత అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆమె ఫేస్బుక్ స్నేహితుడు, పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా (29) సోమవారం స్పష్టం చేశాడు.
ఆమె 20న భారత్కు వెళ్లిపోతుంది
పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా వెల్లడి
పెషావర్: భారత్ నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన వివాహిత అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆమె ఫేస్బుక్ స్నేహితుడు, పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా (29) సోమవారం స్పష్టం చేశాడు. తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ముగిశాక ఆగస్టు 20న భారత్కు తిరిగి వెళ్లిపోనుందని వెల్లడించాడు. ‘‘ఫేస్బుక్లో పరిచయమైన అంజు పాక్ సందర్శనకు వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. మా ఇంటిలో మా కుటుంబానికి చెందిన ఆడవారితో కలిసి ఆమె ప్రత్యేక గదిలో ఉంటోంది. జిల్లా యంత్రాంగం మాకు తగిన భద్రత కల్పించింది’’ అని నస్రుల్లా అప్పర్ దిర్ జిల్లా, కుల్షో గ్రామం నుంచి భారత వార్తా సంస్థకు ఫోనులో చెప్పాడు. అంజు(34), అర్వింద్ దంపతులు రాజస్థాన్ అల్వార్ జిల్లాలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్బుక్లో పాక్కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. దీంతో ఔషధ రంగంలో పనిచేస్తున్న అతడిని కలుసుకోవడానికి అంజు జైపూర్ నుంచి బయలుదేరి పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తాను పాక్కు రాలేదని, ఈ విషయంలో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని అంజు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యడియూరప్పపై నాన్బెయిలబుల్ వారంట్
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీచేసింది. -
శిల్పా శెట్టిపై మోసం కేసు!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. -
‘మోదీ’ తాడాసనం!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ‘తాడాసనం’పై ఓ వీడియోను విడుదల చేశారు. -
పుణె వైద్యుడి వెనుక పెద్ద నెట్వర్క్
మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగు కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతిచెందిన కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. -
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం
భాజపా నేత పెమా ఖండూ అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరసగా మూడోసారి ప్రమాణం చేశారు. గురువారం ఈటానగర్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కె.టి.పర్నాయక్ ఆయనతో, మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించారు. -
జాతీయ భద్రత సలహాదారుగా అజీత్ డోభాల్ పునర్నియామకం
జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజీత్ డోభాల్ను కేంద్రప్రభుత్వం గురువారం మరోసారి నియమించింది. -
సంక్షిప్త వార్తలు (5)
ఇంజినీరింగ్లో, అందులోనూ ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతుండటం శుభపరిణామం. 2017లో 995 మంది అమ్మాయిలు ఐఐటీల్లో చేరగా, 2023 నాటికి ఆ సంఖ్య 3,411కు చేరింది. -
పూర్తి స్థాయిలో బలగాలను వినియోగించండి
వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలనకు పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలతో బలగాలను వినియోగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. -
బెంగాల్ రాజ్భవన్లోకి వెళ్లకుండా.. సువేందు అధికారిని అడ్డుకొన్న పోలీసులు
లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ను కలిసేందుకు వెళుతున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారిని కోల్కతా పోలీసులు అడ్డుకున్నారు. -
ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు.. వెబ్సైట్పై ఈడీ సోదాలు
లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆన్లైన్ బెట్టింగ్లు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను అక్రమంగా ప్రసారం చేస్తున్న ఓ వెబ్సైట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. -
రక్త దాతలకు ఉచితంగా బ్లడ్ గ్రూప్ సమాచారం
రక్త దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంక్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. -
కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోకండి
జమ్మూకశ్మీర్ అంశాన్ని చైనా-పాక్ ప్రస్తావించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. చైనా ప్రధాని లా కియాంగ్తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. -
పాపువా న్యూగినీకి భారత్ చేయూత
ఇటీవల పాపువా న్యూగినీలో భారీ కొండచరియలు విరిగిపడిన ఎంగా ప్రావిన్సుకు మనదేశం గురువారం 19 టన్నుల మానవతా, విపత్తు సహాయ(హెచ్ఏడీఆర్) సామగ్రిని పంపింది. -
సిక్కింలో విరిగిపడిన కొండచరియలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిక్కింలోని మంగన్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతిచెందారు. -
10, 12 తరగతుల బోర్డు పరీక్షల కేంద్రాల్లో బాలికలకు రుతు రుమాళ్లు
చదువుకునే బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు రుతుస్రావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. -
26న లోక్సభ స్పీకర్ ఎన్నిక
లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇందుకోసం నామినేషన్లను స్వీకరించనున్నట్లు లోక్సభ సచివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
మిగులు జలాలపై మాట మార్చిన హిమాచల్
సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ నీటి సంక్షోభం అంశం పలు మలుపులు తిరుగుతోంది. దేశ రాజధానికి మిగులు జలాల విడుదలపై హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. -
అవినీతిపై 4 నెలలుగా నిరాహార దీక్ష.. మథురలో సామాజిక కార్యకర్త మృతి
గ్రామీణాభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ సామాజిక కార్యకర్త మృతిచెందారు. -
నిరుటి రికార్డును తిరగరాస్తాం
భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలను ఇవ్వనున్నామని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. -
గ్రేస్ మార్కులు రద్దు
నీట్-యూజీ (2024) పరీక్షపై భారీస్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ.. గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా.. ఈసారి కూడా ఆ సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది.