Aditya-L1: సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది.

Updated : 08 Nov 2023 08:17 IST

బెంగళూరు: సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం ఒక ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు. హెచ్‌ఈల్‌1ఓఎస్‌ను గత నెల 27న ఇస్రో ఆన్‌ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు. ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చర్యలను శరవేగంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్‌లో చిత్రాలను అందిస్తుంది. తాజాగా అది సౌర జ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్‌ దశను నమోదు చేసింది. దీని ద్వారా.. సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్‌ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఈ పరికరాన్ని బెంగళూరులో ఇస్రోకు చెందిన స్పేస్‌ ఆస్ట్రోనమీ గ్రూప్‌ అభివృద్ధి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని