Aryan Khan: ఆర్యన్ఖాన్ను కేసులో ‘ఇరికించేలా’ దర్యాప్తు..!
క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్ లభించడంతో.. ఈ కేసులో తొలుత దర్యాప్తు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్
అనేక అవకతవకలు జరిగాయన్న సిట్
దిల్లీ: క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్ లభించడంతో.. ఈ కేసులో తొలుత దర్యాప్తు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్సీబీ దర్యాప్తులో తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఈ కేసును రీ ఇన్వెస్టిగేట్ చేసిన సిట్(పత్యేక దర్యాప్తు బృందం) గుర్తించింది. ఆర్యన్ ఖాన్ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
గత ఏడాది అక్టోబరు 2న కార్డీలియా కంపెనీకి చెందిన క్రూజ్ నౌకలో డ్రగ్స్ దొరకడంతో అప్పటి ఎన్సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో అధికారులు మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్ ఖాన్ ఒకరు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన వాంఖడేపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను కేసును తప్పించారు. ఆ తర్వాత సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న సంజయ్కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కేసును అప్పగించారు.
వైద్య పరీక్షలు, వీడియోగ్రఫీ లేకుండానే..
అనంతరం సిట్ దర్యాప్తు చేపట్టగా.. ఎన్సీబీ బృందం అనేక అవకతవకలకు పాల్పడినట్లు బయటపడింది. కేవలం ఆర్యన్ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆర్యన్ను అరెస్టు చేసిన తర్వాత అతడు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని రుజువు చేసేందుకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదని సిట్ హెడ్ తెలిపారు. క్రూజ్ నౌకలో సోదాలు చేపట్టినప్పుడు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు.
ఆర్యన్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసే విషయంలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని సిట్ హెడ్ వెల్లడించారు. ఈ కేసులో తొలి నుంచీ ఆర్యన్ ఫోన్ స్వాధీనంపై అనేక ప్రశ్నలు తలెత్తినట్లు తెలిపారు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు లేదా కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ వెల్లడించింది. అంతేగాక, డ్రగ్స్ సరఫరాలో అంతర్జాతీయ ముఠాతో అతడికి సంబంధాలున్నట్లు ఎన్సీబీ చేసిన ఆరోపణలకు కూడా సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. అందుకే అతడికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లు పేర్కొంది.
ఇక ఈ కేసులో సాక్షిగా మారిన ప్రభాకర్ సెయిల్ను ప్రశ్నించగా.. అధికారులు తనతో తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నట్లు చెప్పాడని సిట్ వెల్లడించింది. అంతేగాక నౌకలో ఎలాంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తాను చూడలేదని సెయిల్ చెప్పాడట. ఆర్యన్ కుటుంబం నుంచి ఎన్సీబీ అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు సెయిల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే అతడు అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. అయితే సెయిల్ గుండెపోటుతో చనిపోయినట్లు ఎన్సీబీ ఆ మధ్య వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ