Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్‌ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

వందే భారత్‌ లోకో పైలట్ల అప్రమత్తత వేలాది మంది ప్రయాణికులను కాపాడింది. రాజస్థాన్‌లోని భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 02 Oct 2023 18:47 IST

జైపుర్‌: లోకో పైలట్ల (Loco Pilot) అప్రమత్తతతో వందే భారత్‌ రైలు (Vande Bharat Train)కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, రాళ్లను గుర్తించిన లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో వేలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్‌లోని భిల్వాడా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 7.50 గంటలకు ఉదయ్‌పుర్‌ నుంచి జైపుర్‌కు వందే భారత్‌ రైలు బయలుదేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో రైలు భిల్వాడా సమీపంలో రాగానే రైల్వే ట్రాక్‌పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.

కుండపోత వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొని.. ప్రాణాలు పోగొట్టుకొన్న యువ డాక్టర్లు

అనంతరం కిందకు దిగి రైలు పట్టాలను పరీక్షించగా.. రాళ్లతోపాటు ఇనుపరాడ్లు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. కొన్నిచోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిందా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని