Acharya: ‘ఆచార్య’ ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. పెరిగిన ధరలు

చిరంజీవి- రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 29న విడుదలకానున్న ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి శుభవార్త వినిపించింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వంరాష్ట్ర వ్యాప్తంగా ‘ఆచార్య’ ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది.

Updated : 25 Apr 2022 17:37 IST

హైదరాబాద్‌: చిరంజీవి- రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 29న విడుదలకానున్న ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రియులకు శుభవార్త వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆచార్య’ ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్తా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్‌ అథారిటీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐదో ఆటతోపాటు టికెట్‌ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్‌ కలిసి నటించిన చిత్రంకావడంతో ‘ఆచార్య’పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ధర్మస్థలి అనే ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. పూజాహెగ్డే, సోనూసూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని