ఈ సీరియస్ పాత్ర సవాలు విసిరింది: ప్రియదర్శి
ప్రియదర్శి తనలో దాగి ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసేందుకు ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్లో నటించాడు. విద్యా సాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రియదర్శి పేరు చెప్పగానే ‘పెళ్లి చూపులు’ చిత్రంలోని ‘నా సావు నేను చస్తా నీకెందుకు’ అనే సంభాషణే గుర్తొస్తుంది తెలుగు ప్రేక్షకులకి. ఈ ఒక్క డైలాగ్తోనే హాస్య నటుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేశాడు. అలా అని ప్రియదర్శి కామెడీ పాత్రలకే పరిమితం కాలేదు. ‘మల్లేశం’ చిత్రంతో కథానాయకుడిగా మారాడు. పలు వెబ్ సిరీసుల్లోనూ సందడి చేశాడు. అయినా ఏదో వెలితిగా భావించిన ప్రియదర్శి తనలో దాగి ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసేందుకు ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్లో నటించాడు. విద్యా సాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి పంచుకున్న విశేషాలు మీ కోసం..
* ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐ.ఎన్.జి) నేపథ్యం ఏంటి?
ఇదొక క్రైమ్ డ్రామా. ఓ మంచి వ్యక్తి చెడ్డవాడిగా మారేందుకు పరిస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో ఇందులో చూడొచ్చు. ఏడు ఎపిసోడ్లతో ఈ సిరీస్ సాగుతుంది.
* మీ పాత్ర గురించి ఏం చెప్తారు?
‘పెళ్లి చూపులు’ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ‘జాతి రత్నాలు’ వరకు ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే నటించాను. ఐ.ఎన్.జి సిరీస్ ద్వారా నాలోని విభిన్న కోణాన్ని బయటపెట్టే అవకాశం లభించింది. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్రలో కనిపించలేదు.
* కామెడీ టైమింగ్లో మీకు మంచి పేరుంది. మరి ఈ సిరీస్ అందుకు భిన్నం కదా?
ఈ సిరీస్లో నేను ఆది అనే పాత్రలో కనిపిస్తాను. ‘నా జీవితంలో పోగొట్టుకునేందుకు ఇంకా ఏం మిగిలి లేదు’ అని నిర్ణయించుకున్న వ్యక్తి ఆది. ఇలాంటి వైవిధ్యభరిత పాత్రని పోషించడం నాకొక పెద్ద సవాలు అనిపించింది. అలాంటి వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల్ని, సంబంధిత వార్తల్ని పరిశీలించాను. సీరియస్గా కనిపించేందుకు ఓ నటుడిగా నా వంతు ప్రయత్నం చేశాను. ఈ సిరీస్లో యాక్షన్తోపాటు తగినంత రొమాన్స్ ఉంటుంది.
* మీకు ఇష్టమైన మాధ్యమం.. సినిమా లేదా వెబ్ సిరీస్?
ఇష్టం అంటూ ఏం లేదు. ఆయా మాధ్యమానికి తగ్గట్టు నటించేందుకు సిద్ధంగా ఉంటాను. కథ చెప్పే విధానం మినహా సినిమాకి, వెబ్ సిరీస్కి మధ్య వ్యత్యాసం నాకు కనిపించలేదు. ఈ రెండు మాధ్యమాల్లోనూ ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఓ నటుడిగా నాలోని విభిన్న కోణాల్ని ఆవిష్కరించే అవకాశాల్ని వదులుకోను. ఎప్పటిలానే నాకు బాగా నచ్చిన కామెడీ పాత్రల్ని చేస్తుంటాను.
* దర్శకుడు సురేశ్ కృష్ణ ఈ సిరీస్ని నిర్మించారు. ఆయనతో ప్రయాణం ఎలా సాగింది?
నిర్మాతగా ఆయనకు ఉన్న విజన్, స్పష్టత నన్ను ఆశ్చర్యంలో పడేసింది. ఆయనతో ప్రయాణం ఎంతో ఆసక్తికరం.
* తదుపరి ప్రాజెక్టులు?
త్వరలోనే ‘లూసర్ 2’ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, శర్వానంద్తో కలిసి నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్తో నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ చివరి దశలో ఉంది. ఇందులో మంచి కామెడీ పాత్ర పోషిస్తున్నాను. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు