Singeetam srinivasa rao: ప్రభాస్-నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్-కె’లో నేను చేసింది అదే..!
ఆయనో సినీ శాస్త్రజ్ఞుడు..ప్రతి సినిమా ఊహాకందని అద్భుతం..ప్రతి పాత్ర మిరాకిల్..ఆయనను చూస్తే ఆ పాత్రల సృష్టికర్త ఈయనా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే.
షూటింగ్ ఆలస్యం అయ్యిందని కోపగించుకున్నానని కమల్ అలిగాడు..!
Singeetam srinivasa rao: ఆయనో సినీ శాస్త్రజ్ఞుడు.. ప్రతి సినిమా ఊహకందని అద్భుతం.. ప్రతి పాత్రా మిరాకిల్.. ఆయనను చూస్తే ఆ పాత్రల సృష్టికర్త ఈయనా? అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. కథాగమనం, పాత్రల రూపకల్పన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి.. వీటన్నింటిని సినీ తెరపై ఆవిష్కరించిన లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. చిత్ర విచిత్రాలే కాదు.. సాంఘిక, పౌరాణిక పాత్రలతోనూ గిమ్మిక్కులు చేశారాయన! ఆ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినీ విశేషాలు, తన అద్భుత ఆవిష్కరణల తీరుతెన్నులను పేర్కొన్నారు.
మీ వయస్సు అలాగే ఉండేందుకు అమృతం ఏమైనా తాగారా..?
సింగీతం: ఇదే విషయాన్ని చాలా మంది అడుగుతారు. 92వ ఏట అడుగుపెడుతున్నా. ఏమిటో ఈ బహుమతి. ఇప్పటికీ పాట రికార్డు చేసినా, మాట్లాడినా అలాగే ఉంటుంది. నడక మారలేదు. ఆలోచన ఇంకా షార్ప్గా ఉంది. నాకుగా నేను ప్రశ్నించుకుంటే.. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇదే నాకు బాగా అబ్బింది. అదే కారణం కావొచ్చు. మెంటల్గా నా వయస్సు ఇంకా 25 ఏళ్లే. ‘మాయాబజార్’లో చేరినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే స్థాయిలో పని చేయాలని ఉంటుంది.
‘మాయాబజార్’కు కో-డైరెక్టరా..? అసోసియేట్ డైరెక్టరా..?
సింగీతం: అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా కేవీరెడ్డి తీసుకున్నారు. నాకో పరీక్ష పెట్టారు. ‘అలీవర్ గోల్ఫీ నాటకం అనువాదం చెయ్.. మూడు నెలల తర్వాత తీసుకుంటా’ అన్నారు. ఈ మూడునెలల్లో డైలాగులు, పాటలు, అన్నీ రాసి ఆయనకు ఇచ్చి పని పూర్తయ్యిందని చెప్పా. ‘నువ్వు చేసిన పని బాగుందో లేదో తెలియదు. కానీ, పని పూర్తి చేశానని చెప్పడం నాకు నచ్చింది. తీసుకున్న పనిని పూర్తి చేయకుండా వాయిదాలు వేసి కారణాలు చెప్పేదాని కన్నా, పని పూర్తి చేయాలనే లక్ష్యంతో వచ్చావు. అది బాగుంది’ అని చెప్పారు. ‘మాయాబజార్’కు అప్రెంటిస్ అసిస్టెంటుగా పని చేయమన్నారు. ‘నీకు ఏమీ తెలియదు. నీకు నిర్మాతతో జీతం ఇప్పించడం సరికాదు. డబ్బులు ఇవ్వలేం. సినిమాలో పేరు ఉండద’ని చెప్పారు. వారం తర్వాత రమ్మన్నారు. వారం తర్వాత వెళ్తే ‘మిస్టర్ శ్రీనివాసరావు.. నిర్మాతలు, దర్శకులకు ఏళ్లు గడిస్తే గానీ రాని అనుభవం వారంలో వచ్చింది. నువ్వు చేయాల్సిన మాయాబజారే లేద’న్నారు. తర్వాత ‘దొంగరాముడు’ చేద్దామన్నారు. అంతలోనే మళ్లీ ‘మాయాబజార్’ మొదలయ్యింది. అదే నాకు తొలి సినిమాగా మారింది.
మొదటిసారి ఎన్టీఆర్ను కృష్ణుడి గెటప్లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
సింగీతం: రామారావు కృష్ణుడి గెటప్లో వచ్చి నిలబడ్డారు. చుట్టూ అందరూ జనం. కేవీ రెడ్డిగారు అందరి అభిప్రాయం తీసుకున్నారు. ఆయన్ను చూడగానే ఎలా ఉందో చెప్పలేని అనుభూతి కలిగింది. అదో అద్భుతం.
డైరెక్షన్ చేశారు.. నిర్మాత, రైటర్, యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ రాశారు.. మిగిలినవి ఎందుకొదిలేశారు?
సింగీతం: నాకు ఎంత తెలిసినా, అంతా తెలిసిన ఒక నిపుణుడు చేస్తున్నప్పుడు నోరు మూసుకోవాలని కూడా తెలుసు. ప్రతి ఒక్కరి దగ్గర నాకు కావాల్సింది తీసుకున్నా తప్పితే.. నేను వేలు పెట్టలేదు.
సాంకేతికత అనుకున్నంత లేని సమయంలో మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 లాంటి చిత్రాలకు స్ఫూర్తి ఎవరు..?
సింగీతం: నేను సైన్స్ స్టూడెంట్ను. ఎన్నో పరిశోధనలు చేసేవాళ్లం. ఆ సమయంలోనే హెచ్.జి.వెల్స్ రాసిన పుస్తకాలు చాలా చదివా. అవే నాపై చాలా ప్రభావం చూపించాయి. అలా టైం మెషీన్ నేపథ్యంలో ‘ఆదిత్య 369’ చేశాం. సినిమా అంటే పాట, ఫైట్, సెంటిమెంటు కాదు.. ఒక సమస్య ఉండాలి. దాన్ని పరిష్కరించాలి. అప్పుడే బాగా నిద్ర పడుతుంది. సాధారణంగా జీవితం గడుస్తుంటే సంతోషంగా ఉండదు. ఛాలెంజింగ్గా ఉన్నప్పుడే బాగుంటుంది. దాన్ని మేమే క్రియేట్ చేసుకునే వాళ్లం.
‘మైఖేల్ మదన కామరాజు’లో కథ చెబుతా పాట బాలు గారితో కాకుండా మీరే ఎందుకు పాడారు..?
సింగీతం: మొదట ఇళయరాజా పాడారు. నేను యాక్టింగ్ చేశా. కమల్హాసన్ డైరెక్షన్ చేస్తుంటే.. నేను నటించా. కమల్కు అదే మొదటి డైరెక్షన్. బాలు కూడా నన్నే పాడాలని నిర్మాతకు చెప్పడంతో పాడాల్సి వచ్చింది. పక్కా ప్రణాళికతో 90 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం.
వాణిజ్య సినిమాలు వస్తున్న సమయంలో మూకీ సినిమా ‘పుష్పక విమానం’ ఎందుకు తీయాలని అనిపించింది?
సింగీతం: అది వాణిజ్య సినిమానే. కమల్హాసన్ ఉన్నాడు ఇంకేం కావాలి..? ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఏ భాష లేకుండా తీస్తే అన్ని భాషల సినిమా అవుతుంది కదా! ఒకే భాషలో తీస్తే కమర్షియలా..? అన్ని భాషల్లో తీసిన సినిమా కమర్షియలా...? చెప్పండి. 13 భాషల్లో విడుదల చేశాం. ఒక టైటిల్ మాత్రమే మారింది. ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తి చేశాం. అన్నీ తెలిసిన వారు బాగుందని చెప్పి సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఏమీ తెలియని కన్నడ నాగరాజు మాత్రం ‘నేను ఈ సినిమా చేస్తా’నని ముందుకు వచ్చారు. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమా చేశా. ఆలోచిస్తే ఈ సినిమా ఎవరూ తీయరని భయం.
బాలకృష్ణతో ఎన్ని సినిమాలు చేశారు..? ఆదిత్య 369 ఆయనతోనే ఎందుకు చేయాలనుకున్నారు..? భైరవ ద్వీపంలో విరిసింది పాట వేటూరి కాకుండా మీరే రాశారు కదా..?
సింగీతం: గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాల్లోని కథలను అనుకున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కథ ఎంచుకున్నాం. దానికి బాలకృష్ణ బాగుంటారని అనిపించింది.వర్తమానం ఆయనే.. భవిష్యత్తులోనూ ఆయనే నటించాల్సి వచ్చింది. విరిసింది పాట వేటూరి రాయాలి. ఆయన అదిగో, ఇదిగో వస్తానని రాలేదు. నాకు సమయం ముఖ్యం. అలా పాటించకపోతే ఇబ్బంది పడుతా. ఆవేశంతో పాట రాసేశాను. ఆ తర్వాత రికార్డింగ్ ఆపేశా. మాధవపెద్ది సురేష్తో ఒకసారి వేటూరిని పిలిపించాలని చెప్పా. ఆయన వచ్చి బాగుందని చెప్పిన తర్వాతే ఆ పాట రికార్డింగ్ చేశాం.
ఆదిత్య 369 సినిమా చూసి నాసా నుంచి చాలా మంది వచ్చి అభినందనలు చెప్పారట..? ఈ టైటిలే ఎందుకు పెట్టారు..?
సింగీతం: అవును. అమెరికా, గుంటూరులో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చి ప్రపంచంలో టైం మెషీన్ మీద వచ్చిన సినిమాలన్నీ చూసి ఆదిత్యలోని టైం మెషీన్ పర్ఫెక్ట్గా ఉందని తేల్చారు. నాకు సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. సాంకేతికత తెలిసి చేసిన సినిమా కాదది. ఏదో మనసుకు తట్టింది చేశా. ఆదిత్య అంటే హీరో పేరు అనుకుంటారు. నాకు 9.. మంచి నంబరు. అందుకే అలా పెట్టాం.
ఆదిత్య 369 సీక్వెల్ తీస్తామన్నారు. కదా..?
సింగీతం: ఆదిత్య 999 సినిమా అనుకున్నాం. బాలకృష్ణకు కూడా చేయాలని ఉంది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం. కథ సిద్ధంగా ఉంది.
మాస్ కమర్షియల్ హీరో బాలకృష్ణ కదా..ఆయనతో కురూపి పాత్ర ఎలా చేయించారు..?
సింగీతం: భైరవద్వీపంలో కురూపి పాత్రే హీరో. అందంగా ఉండి, పాటలు పాడుకుంటూ, ఫైట్లు చేసుకుంటే డిస్ట్రిబ్యూటర్లలో హీరోగా ఉంటారేమోగానీ జనంలో కాదు. అనుకోకుండా చేసే పాత్రే హీరోగా జనం భావిస్తారు. అలా రామారావు చేశారు. అలా కురూపిగా చేయడంతో బాలకృష్ణకు పేరు వచ్చింది. పాటలు పాడితే గుర్తింపు ఏం ఉంటుంది. వారం పాటు కష్టపడ్డారు. భోజనం లేదు. జ్యూస్ మాత్రమే తాగేవారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల దాకా మేకప్ అలాగే ఉండేది.
‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’ షూటింగ్ సందర్భంగా ఏం జరిగింది?
సింగీతం: అందులో రామారావు శంకరుని పాత్ర వేస్తున్నారు. పాము మెడలోకి వెళ్లే సన్నివేశం నాలుగు భాగాలుగా అనుకున్నాం. రామారావు అలా అవసరం లేదు. పామును వదిలేయండి. అదే వచ్చేస్తుందని చెప్పారు. అలాగే వెళ్లి ఆయన మెడలో చుట్టుకుంది. ఎవరికీ నోట మాట రాలేదు.
ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’కు అశ్వినీదత్ మిమ్మల్ని మెంటర్గా ఉండాలన్నారట..?
సింగీతం: స్క్రిప్టు వరకు మాత్రమే మార్పులు, చేర్పులు చేసి ఇచ్చాను. అంతే!
కమలహాసన్తో చాలా సినిమాలు చేశారు. సొమ్మొకడిది..సోకొకడిదిలో ఒక విషయంలో బాగా అలిగారట ఎందుకు..?
సింగీతం: సముద్రం ఒడ్డున సినిమా షూటింగ్ జరుగుతోంది. కమల్, జయసుధ డ్యూయెట్ అది. 3 గంటలకల్లా వచ్చేయాలి. 4.30 గంటలకు కూడా రాలేదు. ‘ఎండపోతోంది’ అంటూ గట్టిగా అరిచా. ఎవరో వెళ్లి కమల్హాసన్ను తిడుతున్నట్టు చెప్పారు. నేరుగా వచ్చి కూర్చున్నారు. ‘నాకు కోపంగా ఉంది. నేను షూటింగ్కు రానని డైరెక్టర్కు చెప్పండ’ని అసిస్టెంట్కు చెప్పాడు. ‘నా కోసం, నీకోసం సూర్యుడు ఉండడు. మళ్లీ రేపు రావాలి కదా’ అనే సరికి అంతా వచ్చేశారు. కమల్తో ఏడు సినిమాలు చేశా. మా మీద మేమే జోకులు వేసుకుంటాం. విచిత్ర సోదరులు విడుదలయ్యింది. పంజు అరుణాచలం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘సినిమా ఎంత హిట్ అయితే అంత డబ్బు చెల్లిస్తా’మని చెప్పారని అన్నారు. నేను ‘హిట్ అవుతుందని గ్యారెంటీ ఏంటీ, ఫ్లాప్ అయితే’ అని అడిగా. డిస్ట్రిబ్యూటర్ల ముందు అలాంటి మాటలేంటనీ నొచ్చుకున్నారు. నాకు సూటిగా మాట్లాడే అలవాటు ఉండటంతో అలా మాట్లాడా. తర్వాత కమల్, నిర్మాత సరికాదని సర్దిచెప్పారు.
మీ సొంతూరు ఎక్కడ..?
సింగీతం: మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అంతా నెల్లూరులోనే తిరిగాం. చదువంతా అక్కడే అయ్యింది. ఉదయగిరిలో పుట్టాను. ఏడాదిన్నర పాటు ఉపాధ్యాయుడిగా పని చేశా. అక్కడ ఆస్తులేం లేవు. ఇల్లు, ఆస్తులున్న ఊరు చెన్నై. అదే సొంతూరుగా మారింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి మీ వయస్సెంత..? ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులు పడ్డరా..?
సింగీతం: అప్పటికి నాకు 16 ఏళ్లు. రేడియో లేదు. తర్వాత రోజు పేపరు వచ్చేది. జెండా ఆవిష్కరణ చేద్దామంటే నాన్న ఉండే పాఠశాలకు వెళ్లా. అక్కడ సంబరాలు చేసుకున్నాం. అందరికీ డబ్బు కావాలి. ఇల్లు ఉండాలి. మేం ఆరోగ్యం బాగుండేలా ప్లాన్ చేసుకున్నాం. విజయ ఆసుపత్రికి దగ్గరగా ఇల్లు ఉండాలనుకున్నాం. అలాగే ఉన్నాం.
మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా..?
సింగీతం: పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాత బాగా ప్రేమించుకున్నాం. 62 ఏళ్లు నాతోనే ఉంది. ఎక్కడికి వెళ్లినా నాతో వచ్చేది. ఆమె ఇప్పుడుంటే బాగుండు. మూడు నెలల క్రితమే కాలం చేశారు. అయినా నన్ను పని చేయాలని చెప్పినట్టే అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చా. ఇద్దరమ్మాయిలు. ఒకరు చెన్నైలో, మరొకరు యూకేలో ఉన్నారు.
దర్శకుడిగా మీ మొదటి సినిమా ఏది..?
సింగీతం: నీతి-నిజాయితీ. అది మూగవాడి కథ. అది సూపర్ డూపర్ ఫ్లాప్.
జపాన్ అనే వ్యక్తి లేకపోతే విచిత్ర సోదరులు లేరని అంటారు..ఎవరతను..?
సింగీతం: అవును. తమిళ్ వ్యక్తి. అతన్ని అందరం జపాన్ అంటాం. మరుగుజ్జు పాత్రకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అతనే చూసుకున్నారు. అతను లేకపోతే ఆ సినిమా లేదు. కమల్హాసన్ కూడా అదే మాట అన్నారు.
ఉషాకిరణ్ మూవీస్లో ‘మయూరి’ చేశారు. సుధాచంద్రన్ను హీరోయిన్గా మీరే పెట్టాలనుకున్నారా.? రామోజీరావు సూచించారా..?
సింగీతం: ఎంపిక నాదే. ఒప్పుకోవడం ఆయన గొప్పతనం. హీరోయిన్తో సినిమా తీసి.. చివర్లో సుధాచంద్రన్తో నృత్యం చేద్దామనుకున్నాం. కథ నడుస్తున్నప్పుడు అట్లూరి రామారావుకు చెప్పాను. ఆయన సుధా చంద్రన్ను పిలిపించారు. అందరం కలిసి మాట్లాడుతుంటే.. ఆమె కళ్లలో ఏదో సాధించాలనే పట్టుదల ఉన్నట్టు కనిపించింది. ఇదే విషయాన్ని రామోజీరావుకు చెప్పా. ఆమెను ఎంపిక చేయాలనడంతో ఓకే అన్నారు. తొలిరోజు డైలాగ్ చెప్పడం రాక గదిలోకి వెళ్లి ఏడ్చేసింది. నేను వెళ్లి కాలు పోతే జైపూర్ వెళ్లి కాలు పెట్టించుకొని నృత్యం చేశావ్.. చిన్న డైలాగులకు భయపడుతున్నావా..?అనడంతో వెనుదిరిగి చూడకుండా సినిమా పూర్తి చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.