Adivi Sesh: సుహాస్‌కు నేను అభిమానిని.. ఈ సినిమా ట్రైలర్‌ 10 సార్లు చూశా: అడివి శేష్‌

‘అంబాజీపేట మ్యారేజిబ్యాండు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు.

Updated : 31 Jan 2024 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కలర్‌ఫోటో’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు సుహాస్‌ (Suhaas). ఆయన ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజిబ్యాండు’ (Ambajipeta Marriage Band). దుష్యంత్‌ కటికినేని దర్శకుడు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్‌, ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్‌ హాజరై చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

‘సాంకేతిక సిబ్బంది నుంచి నటీనటుల వరకు అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసి దర్శకుడిగా మారాను. సుహాస్‌ వల్ల నా కల నెరవేరింది. తొలి సినిమానే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై చేయడం సంతోషంగా ఉంది. సినిమా చూసిన వారంతా మంచి ఫీల్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’ అని దుష్యంత్‌ హామీ ఇచ్చారు.

సూర్య- జ్యోతిక విహార యాత్ర.. ఫొటోలు వైరల్‌.. ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌!

‘ఇది నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రమవుతుంది. మొదటి నుంచి అడివి శేష్‌ నాకు మంచి సపోర్ట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 2న అందరూ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తారు’ అని సుహాస్‌ చెప్పారు. ‘కలలు కనడం ఎంత ముఖ్యమో వాటిని నిజం చేసుకొని విజయాన్ని సొంతం చేసుకోవడం అంతకంటే ముఖ్యం. సుహాస్‌ ప్రతిభావంతుడు. నేను అతడికి అభిమానిని. ట్రైలర్‌ నాకెంతో నచ్చింది. ఇప్పటికి 10 సార్లు చూశాను. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’ అని అడివి శేష్‌ (Adivi Sesh) చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని