Sai Pallavi- Governor Dr Tamilisai: నటిపై ట్రోల్స్.. మండిపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళిసై
నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన చిత్రం ‘శ్యామ్సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ విడుదల అనంతరం.. ఈ చిత్రంలో సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు.
ఇంటర్నెట్ డెస్క్: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన చిత్రం ‘శ్యామ్సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ విడుదల అనంతరం.. ఈ చిత్రంలో సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు. తాజాగా ఈవిషయం గురించి తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడారు. సాయిపల్లవిపై చేసిన వ్యాఖ్యలు బాధిస్తున్నాయన్నారు.
విషయానికొస్తే.. నటి సాయిపల్లవి ఇందులో ఓ దేవదాసి యువతి ‘మైత్రి’గా కనిపించారు. కెరీర్లో తొలిసారి ఓ సున్నితమైన పాత్రను పోషించినామెకు మంచి మార్కులు పడ్డాయి. ప్రణవాలయ పాటలో ఆమె చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలా ఓ పక్క ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. తమిళనాట దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సాయిపల్లవిపై వచ్చిన వార్తలు బాధించాయంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఓ తమిళ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ... ‘‘ సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం నన్ను తీవ్రంగా బాధించింది. గతంలో నా రూపాన్ని ఎప్పుడూ ట్రోల్ చేసేవారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది.. ఆ విషయంలో తీవ్రంగా బాధపడ్డా. కానీ నా ప్రతిభతో, నా శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నా.అలాంటి కామెంట్స్ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. అయితే నాపై చేసిన కామెంట్స్ని పట్టించుకోలేదు.కానీ ఆ ట్రోలింగ్ బాధిస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ‘ఔను’ అనే చెబుతాను” అన్నారు.
అలా పుట్టడం మన తప్పు కాదు..
పొట్టిగా.. డార్క్ స్కిన్తో, నాలాంటి (రింగుల) జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. అందుకే ఓ సామెత ఉంది ‘‘ కాకి పిల్ల కాకికి ముద్దు అని’’. కాకి తన పిల్లను బంగారు పిల్లగా భావిస్తుంది. అంతేకానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా! స్త్రీలు ఎక్కువగా బాడీ షేమింగ్కు గురవుతారు. కానీ పురుషులు అలాంటి మాటలు ఎదుర్కోలేరు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను యువకులుగా చూస్తారు.కానీ స్త్రీలు అలా కాదు. మహిళల ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఈ సమాజం... వారిని బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది’’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?