Leo: ‘లియో’ ట్రైలర్‌ ప్రదర్శన.. లీగల్ నోటీసులు పంపిన సెన్సార్‌ బోర్డు..

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో విజయ్‌ (Vijay) నటించిన సినిమా ‘లియో’ (Leo). దీని ట్రైలర్‌ విషయమై సెన్సార్ బోర్డు కొన్ని థియేటర్లకు లీగల్‌ నోటీసులు పంపింది.

Published : 10 Oct 2023 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) తెరకెక్కించిన చిత్రం ‘లియో’ (Leo). తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, దాన్ని ప్రదర్శించిన కొన్ని థియేటర్లకు సెన్సార్‌ బోర్డు లీగల్‌ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను చిత్రబృందం అక్టోబర్‌ 5న రిలీజ్ చేసింది. చెన్నైలోని కొన్ని థియేటర్‌లలోనూ ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు. అయితే, సెన్సార్ కట్‌ లేకుండానే దాన్ని చూపించారు. దీంతో అభ్యంతర పదాలతో కూడిన ట్రైలర్‌ను చూపించారంటూ సెన్సార్‌ బోర్డు సదరు థియేటర్లకు లీగల్‌ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

సతీమణితో అల్లు అర్జున్‌ సెల్ఫీ.. తనయుడితో ఇలియానా.. నిత్యామేనన్‌ ఆనందం..!

ప్రస్తుతం ఈ ట్రైలర్‌ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్లో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్‌ సాధించిన కోలీవుడ్‌ ట్రైలర్‌గా రికార్డులను సృష్టిస్తోంది. ఇందులో వాడిన అభ్యంతర పదాల గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఆయా సన్నివేశాల్లో అలాంటి పదాలు వాడకపోతే ఎమోషన్‌ పండదని అందుకే వాటిని ఉపయోగించినట్లు తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నట్లు చెప్పారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ‘లియో’లో త్రిష (Trisha) కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘లియో’లో రామ్ చరణ్‌..! 

ఇక మరోవైపు ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ (Ram charan) ఉన్నాడనే ప్రచారం కూడా జోరందుకుంది. దీనికి బలమైన కారణాన్ని చూపుతున్నారు అభిమానులు. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో ఓ టికెట్ బుకింగ్స్ వెబ్‌సైట్‌ నటీనటుల వివరాల్లో రామ్‌ చరణ్‌ పేరు కూడా రాయడం గమనార్హం. దీంతో ఇందులో మెగా హీరో ఉన్నాడనే వార్త వైరల్‌గా మారింది. అయితే,  ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని