Siva Reddy: ‘వెన్నెల’ నేను చేయాల్సింది.. కిశోర్కు అవకాశం వచ్చింది: శివారెడ్డి
మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు ప్రతిష్ఠలు..ఆపై సినీ నటుడిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న శివారెడ్డి విభిన్న కళలతో ఆకట్టుకుంటున్నారు. తొలుత ప్రముఖుల గొంతును అనుకరించి అలరించిన తర్వాత తనలోని ప్రతిభను వెలికి తీయడానికి సినీ రంగాన్ని ఎంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు ప్రతిష్ఠలు.. ఆపై సినీ నటుడిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న శివారెడ్డి విభిన్న కళలతో ఆకట్టుకుంటున్నారు. తొలుత ప్రముఖుల గొంతును అనుకరించి అలరించిన ఆయన తర్వాత తనలోని ప్రతిభను వెలికి తీయడానికి సినీ రంగాన్ని ఎంచుకున్నారు. దేశ, విదేశాల్లో సినీ నటులే కాదు.. రాజకీయ నాయకుల మాటను నటనతో కలిపి ప్రదర్శించేవారు. ఆయన ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమానికి వచ్చారు. తన సినీ, మిమిక్రీ అనుభవాలను పంచుకున్నారు.
ఎంతో పేరు సంపాదించిన మీకు సినీ, మిమిక్రీ కళల్లో ఏదీ ఇష్టం..?
శివారెడ్డి: నేను నటుడిని కావడమే మిమిక్రీతో.. అదే నాకు ఇష్టం.
చాలా సినిమాల్లో వరుసగా నటించారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. ఎందుకు..?
శివారెడ్డి: 1998 నుంచి 2006 వరకు చాలా సినిమాలు చేశా. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సినిమాలు చేశా. కొన్ని సంఘటనలతో ఇక సినిమాలు రావనే కారణంతో నేనే డైవర్టు అయ్యా. మిమిక్రీ చేయాలని నిర్ణయించుకొని అటువైపు వెళ్లా. అది కాకపోతే ఏపనైనా చేయగలను. ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబం మాది. నాన్న చనిపోయిన తర్వాత అన్ని రకాల పనులు చేయాల్సి వచ్చింది. ఆఫీస్బాయ్గా ఎన్టీపీసీలో, బట్టల షాపులో పని చేశా. వరంగల్లో ఒకరింట్లో అన్ని పనులు చేశా. భవిష్యత్తు అన్నది లేని స్థాయి నుంచి 6 వేల ప్రదర్శనలు ఇచ్చిన స్థాయికి ఎదిగా.
చిన్నతనంలో చాలా పనులు చేశారు. ఆ సమయంలో చదువు ఎలా సాగింది..?
శివారెడ్డి: చదువు కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. హాజరు మాత్రమే ఉండేది. ఏదో స్నేహితుల దగ్గర చూసి పరీక్షలు రాశా. ఏడో తరగతి బోర్డు పరీక్షలకు నాకు ముందు ఆరో తరగతి విద్యార్థిని వేశారు. అతను రాసిన జవాబులను నా ప్రశ్నలకు రాశాను. ఇక అంతే సంగతులు.
ఏ వయసులో మిమిక్రీ మొదలయ్యింది..?
శివారెడ్డి: పాఠశాల స్థాయిలోనే జంతువుల అరుపులను మిమిక్రీ చేశాను. తర్వాత టీవీల్లో వచ్చిన సినిమాలు చూసి వాళ్ల మాటలను అనుకరించాను. తొలిసారిగా ఎన్టీఆర్ మాటలనే మిమిక్రీ చేశా.
అభినయం, మిమిక్రీ కలిసి ఎలా చేయగలిగారు..?
శివారెడ్డి: తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా ఒక్కొక్కరూ ఒక్కో తరహా కార్యక్రమాలను చేస్తున్నారు. వాళ్ల కన్నా ప్రత్యేకంగా ఉండేలా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి హీరోలు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుందోనని ప్రాక్టీసు చేశా. అలా ఆ ప్రక్రియలో సక్సెస్ అయ్యాను. ఇప్పటి వరకు చాలా మంది మిమిక్రీ కళాకారులు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.
తొలి సినిమా ఏది..? మీ ఇంట్లో ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారా..?
శివారెడ్డి: 1996లో ‘పిట్టలదొర’లో బాక్సింగ్ రిఫరీ క్యారెక్టర్ అది. హీరో, విలన్ ఎవరైనా నన్నే కొట్టేవాళ్లు. ఆ సమయంలో ఎగిరి పడేవాడిని. ఓసారి నిజంగానే పడిపోవడంతో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అలీ, సాన యాదిరెడ్డి వచ్చి జాగ్రత్త తమ్ముడు అంటూ చెప్పారు. అప్పటి నుంచి అలీతో స్నేహం కుదిరింది. అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఇప్పుడు మా తమ్ముడు సంపత్ వచ్చాడు. బాలకృష్ణ, చిరంజీవితో కలిసి పని చేశాడు.
మిమిక్రీ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?
శివారెడ్డి: బాలకృష్ణ, అమ్రిష్పురి గొంతులు క్లిష్టంగా ఉంటాయి. చాలా ఒత్తిడి ఉంటుంది. నాగార్జున లాంటి వారిది పెద్దగా ఇబ్బంది ఉండదు. గొంతుకు ఇబ్బంది లేకుండా కూల్డ్రింక్స్, చల్లని పానీయాలు ఏవీ తాగను.
సినీ, రాజకీయ ప్రముఖుల ముందు చేసినపుడు వచ్చిన మంచి ప్రశంసలు ఏవీ..?
శివారెడ్డి: వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి అభినందనలు వచ్చాయి. ఆయన ముందు ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు పగలబడి నవ్వారు.
చాలా మంది గురువుల వద్ద నేర్చుకుంటారు. మీరు స్వయంకృషితో ఎదిగారు. మీకు ఓ సంస్థ స్థాపించి మిమిక్రీ నేర్పించాలని లేదా..?
శివారెడ్డి: డబ్బు సంపాదించిన సమయంలో బిజీగా ఉండిపోయా. ఇప్పుడు చెబుతామనుకుంటే స్తోమత లేకుండా పోయింది.
మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది..?
శివారెడ్డి: నా భార్య సహకారం బాగుంటుంది. పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బంది పెట్టా. అప్పుడు అమెరికాలో చాలా కార్యక్రమాలుండేవి. కొన్నిసార్లు రెండు, మూడు నెలలు వెళ్లేవాడిని. నా గురించి ఆలోచించుకుంటూ ఉండేదని చెప్పేది.
పిల్లలెంత మంది..? వాళ్లకు మిమిక్రీపై ఆసక్తి ఉందా..?
శివారెడ్డి: ఇద్దరమ్మాయిలు. ఒక అమ్మాయి ఏడోతరగతి, రెండో అమ్మాయి నాలుగో తరగతి చదువుతోంది. ఇద్దరికీ మిమిక్రీ కళ వచ్చింది. చిన్నమ్మాయి పదకొండు నెలలకే అనుకరణ మొదలెట్టింది. అప్పటికి తనకు మాటలే రావు.
మీ అభిమాన నటి మీనా అన్నారు. హీరో ఎవరు..?
శివారెడ్డి: ఇంకెవరూ చిరంజీవి గారే. ఆయన మాటలే కాదు.. నడక, డ్యాన్సు కూడా చేస్తా. నాలోనూ చిరంజీవి లక్షణాలున్నాయని చాలా మంది అంటారు. వారంలో రెండుసార్లయినా నా కలలో వస్తారు. నా నరనరాల్లో ఆయనే ఉన్నారు. నేను ప్రమాదంలో ఉంటే చేయి ఇచ్చి రక్షించినట్టు కలలో వస్తుంది. స్టాలిన్ సినిమాలో అన్నయ్య కోరి మిత్రుడి పాత్ర చేయించారు.
ఇంకా ఏయే హీరోలతో సినిమాలు చేశారు..?
శివారెడ్డి: దాదాపుగా అందరితో నటించా. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, పవన్కళ్యాణ్, ప్రభాస్లతో చేశా. బాలయ్యతో చేయలేదు. ఇస్మార్ట్ జోడీకి ఆయనొచ్చారు. అప్పుడు పరిచయం చేసుకున్నా. మనం చేస్తున్నాం.. అనగానే సంతోషంగా అనిపించింది. వెంటనే నీతో కాదు.. తమ్ముడితో చేస్తున్నా అన్నారు.
మీరు చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైనదేదీ..?
శివారెడ్డి: అమ్మాయి కోసం బాగా ఇష్టం. బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే తీరు, మారిపోయిన పద్ధతి బాగా ఇష్టం. చాలా ప్రశంసలు వచ్చాయి.
మీరు చేయాల్సిన ప్రాజెక్టు చేయకపోవడంతో ఇతరులకు సక్సెస్ అయ్యిందేమైనా ఉందా..?
శివారెడ్డి: వెన్నెల కిశోర్ అనే ఆర్టిస్టు వచ్చాడు. వెన్నెల సినిమా నేను చేయాల్సింది. చేయలేకపోవడంతో కిశోర్కు అవకాశం వచ్చింది.
ఇండస్ట్రీలో బ్రహ్మరథం పట్టినా, అవమానాలు కూడా ఎదురవుతాయి. మీ కసిని పెంచిన సంఘటనలున్నాయా..?
శివారెడ్డి: సినిమా తల్లి వెళ్లిపోమ్మన్న తర్వాత కసిని పెంచుకోలేం. అప్పుడే మిమిక్రీకి వెళ్లిపోయా. చాలా మంది కళాకారులు వచ్చారు. ఏదో చేశామంటే సరిపోదు. ఇంకా కొత్తగా చేయాలని ఆలోచించా. జానపద పాటలు పాడుతున్నా..
ఒక వేదిక మీద చిరంజీవి మాట్లాడుతూ శివారెడ్డికి మనకంటే ఎక్కువ మంది అభిమానులున్నారని అన్నారు కదా..?
శివారెడ్డి: అది ఆయన గొప్పమనసు. నన్ను ఎంకరేజ్ చేసే విధానమది. వాళ్లకు లేని అభిమానులు నాకున్నారని అనుకోను. శివారెడ్డికి ఇన్ని టాలెంట్లున్నాయి. ఆయన్ని చూస్తే అసూయ పుడుతుంది. అందరు హీరోల అభిమానులు ఆయన్ని అభిమానిస్తారని చెప్పారు. నాకైతే సంవత్సరం అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.
మళ్లీ హీరోగా సినిమా చేస్తున్నారా..?
శివారెడ్డి: ఏదో చిన్న సినిమా చేస్తున్నా. సినిమా పేరు రెంట్ నాట్ ఫర్ సేల్. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. దూకుడులో మంచి పాత్ర వేసినా, అందరూ బాగుందని మెచ్చుకున్నా సినిమాలైతే రాలేదు. ఏడాది పాటు అన్ని ఆఫీసులకు వెళ్లా. చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. కానీ పెద్దగా ఎలివేట్ కాలేదు.
చాలా అవార్డులు అందుకున్నారు. అందులో నంది అవార్డు కూడా ఉంది కదా..?
శివారెడ్డి: భరత ముని అవార్డులు ఆరు, బహుముఖ నట ధ్వని అనుకరణ అవార్డు, న్యూజిలాండ్లో మిమిక్రీ మాస్ట్రో, కామెడీ కింగ్, రేలంగి, జంధ్యాల లాంటి అవార్డులు చాలా వచ్చాయి. వాటిని చూసుకుంటూ మురిసిపోతా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!