ఓటీటీలో ధనుష్‌ చిత్రం.. ఇదిగో టీజర్‌

ధనుశ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో

Published : 22 Feb 2021 13:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధనుశ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ విడుదల వాయిదా పడింది.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాగా ‘జగమే తంత్రం’ను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని