రెండోసారి.. పంథా మారి
చిత్ర సీమలో, ప్రేక్షకుల్లో కాంబినేషన్లపై ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. దర్శకుడు, కథానాయకుడు కాంబోకు
చిత్ర సీమలో, ప్రేక్షకుల్లో కాంబినేషన్లపై ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. దర్శకుడు, కథానాయకుడు కాంబోకు అది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓ దర్శకుడు-నటుడు కలిసి చేసిన తొలి చిత్రం హిట్ అందుకుంటే చాలు ఆ కలయికలో వచ్చే రెండో సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఆ జాబితాలో ఏ చిత్రాలున్నాయి? దర్శక-నటులెవరు? చూసేద్దాం...!
శివ-నాని
దర్శకుడు శివ నిర్వాణ, కథానాయకుడు నాని తమ కెరీర్లో ఎక్కువగా ప్రేమ కథల్నే ప్రేక్షకులకు చూపించారు. గతంలో ‘నిన్నుకోరి’తో అలరించిన ఈ జోడీ ఈసారి యాక్షన్ ప్యాక్తో రాబోతున్నారు. శివ-నాని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా ‘టక్ జగదీష్’. కుటుంబ కథా నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధం ఆవిష్కరించనున్నారు. ఎమోషన్కి ఎంత ప్రాధాన్యం ఉందో యాక్షన్ సన్నివేశాలకు అంతే ప్రాముఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ని చూస్తుంటే నాని లుక్ సైతం పవర్ఫుల్గా ఉంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. షైన్ స్ర్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. నాని-శివ కలయికలో వచ్చిన తొలి చిత్రం విజయం అందుకోవడంతో ‘టక్ జగదీష్’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకీ- శ్రీకాంత్
వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కలిసి పనిచేసిన తొలి సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. క్రేజీ మల్టీస్టారర్గా కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ కాంబోలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘నారప్ప’. ప్రియమణి నాయిక. తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కుతోంది. కుటుంబ కథలకు కేరాఫ్గా నిలిచే శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ని తెలుగులో తెరకెక్కించడం అటు పరిశ్రమ వర్గాల్ని, ఇటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సమాధానంగా గ్లింప్స్ విడుదల చేసి తానేంటో నిరూపించుకున్నారు శ్రీకాంత్. పోస్టర్లు సైతం ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను సమర్పిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.
రవితేజ- రమేశ్
‘వీర’తో తొలిసారి కలిశారు రవితేజ- రమేశ్ వర్మ. యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చి ఆ చిత్రం పర్వాలేదనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఖిలాడి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్లే స్మార్ట్ అనేది ఉప శీర్షిక. గత చిత్రంలానే ఇందులోనూ యాక్షన్తోపాటు కామెడీ ఉండబోతుంది. రవితేజ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ కథానాయికలు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. రవితేజ ఫస్ట్లుక్ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మే 28న రాబోతున్నాడీ ఖిలాడి.
పవన్- హరీశ్
పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ ఈ కాంబినేషన్కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్ను షేక్ చేసింది ఈ జోడీ. అంతటి సూపర్హిట్ తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రకటన వెలువడటమే ఆలస్యం అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. కథేంటి? నాయిక ఎవరు? అంటూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఆ ఆసక్తిని అలాగే కొనసాగిస్తూ ‘పీఎస్పీకే 28’ వర్కింగ్ టైటిల్తో కథని పక్కాగా సిద్ధం చేస్తున్నారు హరీశ్. ‘గబ్బర్సింగ్’లా వినోదాన్ని పంచుతూనే సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కనుందీ ఈ క్రేజీ ప్రాజెక్టు.
తారక్- త్రివిక్రమ్
‘అరవింద సమేత’తో క్రేజీ కాంబినేషన్ జాబితాలో చేరారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. ఈ సినిమాలో త్రివిక్రమ్ తనదైన శైలిలో మాటలు వినిపిస్తూనే అదిరిపోయే యాక్షన్ చూపించి వావ్ అనిపించారు. మరోసారి ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందనడంతో తారక్ అభిమానులు పండగ చేసుకున్నారు. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తొలి సినిమా ఘన విజయం అందుకోవడంతో ఈ కాంబోలో వస్తోన్న రెండో చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే అప్పుడు యాక్షన్ నేపథ్యంలో వచ్చారు ఈసారి రాజకీయ కోణంలో రాబోతున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు.