CoronaEffect: మరో సినిమా విడుదల వాయిదా

కరోనా ప్రభావంతో మరో సినిమా విడుదల వాయిదా పడింది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులన్నీ  పూర్తి చేసుకున్న ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం నిర్ణయం తీసుకుంది.

Published : 26 Apr 2021 21:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రభావంతో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే విరాటపర్వం, లవ్‌స్టోరీ, టక్‌ జగదీశ్‌ వంటి చిత్రాలు తమ విడుదల తేదీని మార్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులన్నీ  పూర్తి చేసుకున్న ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. కరోనాపై సామాజిక సందేశం ఇస్తూ.. ఒక వీడియోను కూడా పంచుకుంది. ‘‘అవును, ‘ఏక్‌ మినీ కథ’ వాయిదా పడింది. ఏప్రిల్‌ 30 మేం బయటికి రావడం లేదు. మీరు కూడా ఇంట్లోనే ఉండండి.. మాస్క్‌ ధరించండి. జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేసింది.

పేపర్‌బాయ్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంతోశ్‌ శోభన్‌ చేస్తున్న రెండో చిత్రమిది. నూతన దర్శకుడు కార్తీక్‌ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కావ్య థప్పర్ హీరోయిన్‌. శ్రద్ధాదాస్‌, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్‌, పోసాని కృష్ణమురళి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని