ఓటీటీలో ఈషా దేవోల్‌

పదేళ్ల తర్వాత అజయ్‌దేవగణ్ తో కలిసి నటిస్తున్నా

Updated : 16 Sep 2022 12:42 IST

అజయ్‌దేవగణ్‌కు జోడిగా ‘రుద్ర’లో..

ముంబయి: ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ సందడి చేయనుంది నటి ఈషా దేవోల్‌. డిస్నీహాట్‌స్టార్‌ వేదికగా ‘రుద్ర’-ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్ అనే వెబ్‌సిరీస్‌లో తొలి సారి ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రాన్ని అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బీబీసీ ఇండియాతో సంయుక్తంగా నిర్మిస్తోంది. క్రైమ్‌, డ్రామా నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌కు జోడిగా నటించనుంది ఈషా.

ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ.. ‘‘బీబీసీతో పాటు అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నటిగా నేనెప్పుడూ కొత్త కథలు ఎంచుకోవడానికే ఇష్టపడతా. ఫ్రెష్‌ లుక్‌తో పోలీసు డ్రామా నేపథ్యంలో గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సిరీస్‌ ఉండబోతుంది. ఓటీటీలో అలరించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నా. పదేళ్ల తర్వాత అజయ్‌దేవగణ్ తో కలిసి నటిస్తున్నా. ఆయనో అద్భుత నటుడు. రుద్ర చిత్రంలో అజయ్‌తో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా’’ అని ఆనందాన్ని పంచుకుంది ఇషా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని