ఈ సినిమా ఏడాది తర్వాత చేద్దామనుకున్నాం!
అభిమానులు, ప్రేక్షకులు తమ చిత్ర బృందానికి జనవరి 11నే సంక్రాంతి పండగను తీసుకొచ్చారని అన్నారు అగ్ర కథానాయకుడు మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన...
హైదరాబాద్: అభిమానులు, ప్రేక్షకులు తమ చిత్ర బృందానికి జనవరి 11నే సంక్రాంతి పండగను తీసుకొచ్చారని అన్నారు అగ్ర కథానాయకుడు మహేశ్బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మహేశ్, విజయశాంతిల నటన, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మహేశ్బాబు మాట్లాడుతూ.. ‘‘జనవరి 11నే మాకు సంక్రాంతి పండగను ఇచ్చిన అభిమానులకు, ప్రేక్షకులకు నిజంగా ధన్యవాదాలు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటుంటే నిజంగా అద్భుతంగా అనిపించింది. ప్రొఫెసర్ భారతి పాత్రను విజయశాంతి తప్ప మరొకరు చేయలేరు. ‘దూకుడు’ తర్వాత నేను చేసిన సినిమాలన్నీ కంటెంట్ ఉన్న సినిమాలు. వాటి స్క్రిప్ట్నకు కట్టుబడి ఉండాలి. అందుకే అందులో అంత ఎనర్జిటిక్గా కనిపించలేదు. కానీ, ఈ సినిమాతో మరోసారి అలరించే పాత్రను చేశా. అనిల్ రావిపూడి ‘ఎఫ్2’ చేస్తుండగా నాకు ఈ సినిమా కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ‘నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏడాది తర్వాత చేద్దాం’ అని ఆయనతో చెప్పా. ‘ఓకే సర్.. ఈలోగా నేను కూడా ఇంకో సినిమా చేస్తా’నని నాతో అన్నారు. అయితే, ‘ఎఫ్2’ విడుదలైన వెంటనే ఫోన్ చేసి, ‘మనం సినిమా చేద్దాం’ అని అనిల్కు చెప్పా. ఆయన రెండు నెలల్లో స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి తీసుకొచ్చారు. నిన్నటి నుంచి నా ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆ క్రెడిట్ అనిల్ రావిపూడికే దక్కుతుంది. ఈ సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. కానీ, ఆయనకు మాత్రం చాలా నమ్మకం ఉంది. రష్మిక, సంగీత సహా ఇతర నటీనటులు సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాట వినిపించినప్పుడు మాత్రం ఒళ్లు గగురుపొడ్చింది. రామ్-లక్ష్మణ్లు సమకూర్చిన ఫైట్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఈ సినిమా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.
ఆ సన్నివేశంలో గ్లిజరిన్ వాడలేదు
‘‘చాలా ఏళ్ల విరామం తర్వాత ఒక మంచి సినిమా చేయడం సంతోషంగా ఉంది. అసలు సినిమాలే చేయొద్దని భీష్మించుకుని కూర్చొన్న సమయంలో అనిల్గారు కథ చెప్పి మరీ ఒప్పించారు. ‘కొడుకు దిద్దిన’ కాపురం తర్వాత మహేశ్బాబుతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి ‘చాలా బాగా చేశారమ్మా.. మమ్మల్ని మళ్లీ ఏడిపించారమ్మా’అంటున్నారు. గతంలో నేను చేసిన ‘ఒసేయ్ రాములమ్మా’, ‘కర్తవ్యం’లో బరువైన పాత్రలు పోషించా. ఈ చిత్రంలోనూ అలాంటి పాత్రే నాకు లభించింది. ప్రీక్లైమాక్స్ చేస్తున్నప్పుడు నాకు తెలియని బాధ కలిగింది. ఆ సన్నివేశం కోసం గ్లిజరిన్ కూడా వాడలేదు. ఈ సినిమా చూసి వచ్చిన వాళ్లు, ఇందులోని ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకుని చెబుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన అనిల్ సుంకరగారు, దిల్రాజుగారికి ధన్యవాదాలు. దేవిశ్రీ అద్భుతమైన పాటలు, అదిరిపోయే నేపథ్య సంగీతం ఇచ్చారు. సంగీత, రష్మికల నటన, కామెడీ టైమింగ్, రైల్లో చేసిన సందడి తదితర సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. విజయశాంతిగారి పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఒక నటిగా ఆమె విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది. ప్రీక్లైమాక్స్లో మహేశ్-విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అందరూ అంటున్నారు. ‘బాహుబలి’లో ప్రభాస్ శివ లింగాన్ని పైకెత్తినట్లు మహేశ్బాబు ఈ సినిమాను మొత్తం తన భుజాలపై మోశారు. ఇంటర్వెల్ బ్యాంగ్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. కార్యక్రమంలో కథానాయిక రష్మిక, సంగీత, దిల్రాజు, అనిల్ సుంకర, రామ్-లక్ష్మణ్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్