వకీల్‌సాబ్‌.. గర్వపడుతున్నా: నివేదా థామస్‌

నివేదాథామస్‌, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. మహిళా సాధికారిత ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఈ సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇస్తున్నారు....

Updated : 09 Apr 2021 10:07 IST

హైదరాబాద్‌: నివేదాథామస్‌, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఈ సినిమాతో తెరపై కనిపిస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’ గురించి నివేదా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు..

ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

నివేదా: ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను. నా యోగక్షేమాలు అడిగినందుకు ధన్యవాదాలు.

పవన్‌కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

నివేదా: కమర్షియల్‌ హంగులు లేనప్పటికీ ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకుని ఇందులో భాగమైనందుకు పవన్‌ సర్‌కి ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయనకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ కథ ఎంతోమందికి చేరువవుతుంది. ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఓ అద్భుత అనుభవాన్ని అందించింది.

వకీల్‌సాబ్‌లో మీకు నచ్చిన పాట?

నివేదా: మగువా మగువా

మీరు పోషించిన పాత్ర గురించి..?

నివేదా: ఇందులో నేను పల్లవి అనే సాధారణమైన అమ్మాయి పాత్ర పోషించాను. మిగతాది సినిమాలో చూడండి.

ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

నివేదా: ‘పింక్‌’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్‌’లో భాగమైనందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ఆ కథను తెలుగువారికి చేరువయ్యేలా తెరకెక్కించడాన్ని గొప్ప బాధ్యతగా భావించాం.

ఈ సినిమా‌ షూటింగ్‌ డైరీస్‌లో మీకు గుర్తుండిపోయే ఓ విషయం?

నివేదా: ఒకటి కాదు ఎన్నో విశేషాలు ఉన్నాయి. కోర్టు రూమ్‌ సన్నివేశాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఇది‌ మీ కెరీర్‌లో బెస్ట్‌ చిత్రమవుతుందని నమ్ముతున్నారా?

నివేదా: ‌అవును.. తప్పకుండా అవుతుంది..

వేణుశ్రీరామ్‌ గురించి.. ?

నివేదా: ఆయనే మాకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని అందించారు. వేణుశ్రీరామ్‌కి ఓ పెద్ద హిట్‌ దక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని