Intinti Ramayanam: ఓటీటీలో ‘ఇంటింటి రామాయణం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Intinti Ramayanam: ఇటీవల థియేటర్‌లలో అలరించిన ‘ఇంటింటి రామాయణం’ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 15 Jun 2023 16:51 IST

హైదరాబాద్‌: రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna), నవ్య స్వామి (Navya Swami), నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేశ్‌ దర్శకుడు. ఇటీవల థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో జూన్‌ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మధ్యతరగతి కుటుంబాలలో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని