Kajal Aggarwal: కాజల్‌ తీపి కబురు చెప్పనుందా?

 కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతుందనే వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. గతేడాది అక్టోబర్‌ 30న ముంబయిలో తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 17 Sep 2021 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతుందనే వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. గతేడాది అక్టోబర్‌ 30న ముంబయిలో తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఎమోజీలే అందుకు ఉదాహరణ అని అభిమానులు భావిస్తున్నారు. 

వివాహం అనంతరం ఈ ఏడాది తెలుగులో ‘మోసగాళ్లు’, హిందీలో ‘ముంబయి సాగా’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది కాజల్‌. తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్న కాజల్‌.. ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్‌ను కోరిందట. ఇప్పటికే ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలతో పాటు హిందీ చిత్రం ‘ఉమ’ సైతం షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. అయితే ఇదే విషయంపై కాజల్‌ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేనప్పటికీ.. త్వరలోనే ఈ జంట కలిసి అధికారికంగా ప్రకటిస్తారనే మాట వినిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు