రామ్‌ సరసన కృతి ఖరారైంది

రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాయికగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి నటిస్తుందంటూ ఇటీవలే ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది చిత్రబృందం.

Published : 05 Mar 2021 21:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాయికగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి నటిస్తుందంటూ ఇటీవలే ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది చిత్రబృందం. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. టైటిల్‌, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో నటిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని