Liger: అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్ టీమ్తో ఛార్మి ఇంటర్వ్యూ
‘‘లైగర్’ (Liger)తో ఇండియాను షేక్ చేస్తానని చెప్పాను. కానీ, అదొక తప్పు స్టేట్మెంట్. మనం ఇండియాను షేక్ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్ సినిమాను దింపుతున్నాం’’ అన్నారు విజయ్
‘‘లైగర్’ (Liger)తో నేను ఇండియాను షేక్ చేస్తానని చెప్పా. కానీ, అదొక తప్పు స్టేట్మెంట్. మనందరం (ప్రేక్షకులు) ఇండియాను షేక్ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్ సినిమాను దింపుతున్నాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మిక్స్డ్మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘లైగర్’. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హీరో విజయ్, దర్శకుడు పూరిని ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..
‘లైగర్’ ట్రైలర్ చూస్తే, కథ ఏంటో అర్థం కావటం లేదు. మీ సినిమా నుంచి ఇంకో ట్రైలర్ వస్తుందా?
పూరి జగన్నాథ్: ‘లైగర్’ ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాం. ఇది ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ. ఆ మూమెంట్లే ట్రైలర్లో కట్ చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఎక్కువ డైలాగ్లు ఆశించారు. ఇందులో హీరో పాత్రకు నత్తి. అలాంటి సందర్భంలో ఎక్కువ డైలాగ్లు పెడితే బాగుండదు. నేను ప్రయత్నించా. కానీ, అంత ఆసక్తిగా లేదు. కథ తెలియకపోయినా, ట్రైలర్ చూస్తే కథ అర్థమైపోతుంది. తల్లీ-కొడుకులు టీ అమ్ముకుంటూ, రిక్షా తొక్కుతూ బతుకుతారు. ఒక కరీంనగర్ కుర్రాడు, వాళ్ల అమ్మ కలిసి ముంబయి వెళ్లి ఏం చేశారు? తన కొడుకును ఛాంపియన్గా చూడటానికి ఆమె ఏం చేసింది? తల్లి కల కోసం ఆ యువకుడు ఎంత కష్టపడ్డాడు? ఏం రేంజ్కు వెళ్లాడు? అన్నది సినిమాలో చూడొచ్చు..!
సినిమాలో మైక్టైసన్ ఉంటే చాలా క్రూరంగా ఉంటారని అనుకుంటాం. కానీ, ట్రైలర్లో చాలా సరదాగా చూపించారు? ఆయన పాత్ర ద్వారా ఏం ఆశించవచ్చు?
పూరి జగన్నాథ్: ట్రైలర్లో ఏం చూపించామో దాన్ని నమ్మి సినిమాకు రండి. ఏవేవో అంచనాలు మాత్రం పెట్టుకోవద్దు. టైసన్కు మాత్రం కొత్త లుక్మాత్రం ఇచ్చాం. క్లైమాక్స్లో వచ్చే సిట్యువేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రాలేదు. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో-విలన్ కూర్చొని మాట్లాడుకోవడం కొత్తగా ఉంది. ఇందులోనూ హీరోకు, మైక్ టైసన్కు వచ్చే సిట్యువేషన్ కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ: ప్రేక్షకులకు ప్రతి సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి. థియేటర్లో ఆ అనుభూతిని మనం చెడగొట్టలేం. అందుకే సినిమాను అక్కడ చూడాలి. కథ చెప్పటం ట్రైలర్ పని కాదు. సినిమా చూడాలన్న ఆసక్తి మీలో రేకెత్తిస్తే, ట్రైలర్ పని పూర్తయినట్లే. ట్రైలర్లన్నీ ఒక ఫార్మాట్లో నడుస్తున్నాయి. దాన్ని ‘లైగర్’ బ్రేక్ చేసింది.
మీ హీరోలకు ఒక ప్రత్యేక యాటిట్యూడ్ పెడతారు. ‘లైగర్’ హీరో కూడా షార్ట్తో ప్రత్యేకంగా ఉన్నాడు.. అది ఎలా సాధ్యమైంది?
పూరి జగన్నాథ్: కథ చెప్పిన తర్వాత తనే క్యారెక్టర్ కోసం వర్కవుట్ చేశాడు. జుట్టు పెంచాడు. హీరోలెవరూ లోయర్ చూపించరు. కానీ, అలా చూపించటానికి విజయ్కు గట్స్ ఉన్నాయి. ఆ క్రెడిట్ అంతా తనదే. నా ఫ్రెండ్ ఇదే వీడియో చూసి, ‘ఏంటన్నా.. విజయ్ ఆ గట్స్.. లోయర్ చూపించాడు’ అన్నాడు. ‘మావాడు సినిమా కోసం చడ్డీ తీసేయమన్నా తీసేస్తాడు’ అన్నాను.
విజయ్ ఏదైనా చేస్తాడని మీకు అనిపిస్తోందా?
పూరి జగన్నాథ్: కచ్చితంగా ఏదైనా చేస్తాడు. ఈ ఏజ్లో ఇలాంటివి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తా?అని విజయ్ నాతో అన్నాడు.
విజయ్ దేవరకొండ: నేను నటుడిని అవుదామనుకున్నప్పుడే ఏదైనా చేయడానికి సిద్ధపడ్డా. ఒకసారి కమిట్ అయితే, చేసేయడమే. పూరిగారు కథ చెప్పినప్పుడు పొడవాటి జుట్టు, కండలతో ‘లైగర్’ హీరో నా ముందు కదలాడాడు. ఎంఎంఏ నేను బాగానే ఫాలో అవుతా. సినిమా చర్చల సమయంలో ‘హీరోకు కొంచెం బాడీ ఉంటే సరిపోతుంది’ అని చెప్పారు. ‘లేదు నాకు సమయం ఇవ్వండి. హీరో ఉంటే బీస్ట్లా ఉండాలి’ అన్నాను. అయినా ఈ కథకు డీసెంట్ బాడీతో చేస్తే మజా రాదు.
అనన్య గురించి చెప్పండి..
పూరి జగన్నాథ్: అనన్యలో చాలా మార్పులు చూశా. ప్రతి మూడు నెలలకూ మారిపోతోంది.
‘లైగర్2’ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది!
విజయ్ దేవరకొండ: దాని గురించి మాట్లాడుకున్నాం. పాత్రలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి.
పూరి జగన్నాథ్: ‘లైగర్2’ చేయమని తొలిసారి అడిగిన వ్యక్తి కరణ్జోహార్.
జనాలు థియేటర్కు రావటం లేదని ఫిర్యాదు ఉంది. సినిమాపై మీకున్న నమ్మకం చూస్తే, చాలా ఎక్కువగా ఉంది. ఓటీటీ ఆఫర్ వచ్చినప్పుడు రూ.200 కోట్లు చాలా తక్కువని మీరు ట్వీట్ పెట్టారు! బాక్సాఫీస్ నుంచి ఎంత వస్తుందని ఆశిస్తున్నారు?
విజయ్ దేవరకొండ: నేనైతే రూ.200 కోట్ల నుంచి మొదలు పెడుతున్నా. అక్కడి నుంచి వచ్చే నంబర్ నేనసలు చూడను. సినిమాలు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు ‘నీ ధర్మం నువ్వు చెయ్.. ప్రకృతి చూసుకుంటుంది’ అని ఒకరు నాతో చెప్పారు. దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నేను దేన్నీ వదలను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. కంటెంట్ చాలా బలంగా ఉంది. నా శక్తికి మించి ఈ సినిమా కోసం చేశా. బడ్జెట్ విషయంలోనూ ఎవరూ కాంప్రమైజ్ కాలేదు. అది చూసి, నేను చాలా ఉత్సాహంగా నటించా.
‘లైగర్’పై భారీ అంచనాలున్నాయి. పొరపాటున జనాలు రాకపోతే, సినిమా బాగోలేదని టాక్ వస్తే?
విజయ్ దేవరకొండ: లాక్డౌన్ సమయంలో పోస్టర్ షూట్ చేస్తున్నాం. ఆ సమయంలో కొవిడ్ ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నేను ఒకటే కోరుకున్నా. ‘నా లైగర్ రిలీజ్ సమయానికి కొవిడ్ లేకుండా, జనాలు ఆస్పత్రి పాలవకుండా, థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ ఇస్తే, థియేటర్లను మేం నింపుతాం దేవుడా..!’ అని అనుకున్నా. ఇప్పుడు అదే జరగబోతోంది.
భావోద్వేగానికి గురైన ఛార్మి..!
‘‘2019 ఆగస్టు నెలలోనే నేనూ పూరిగారు మిమ్మల్ని కలిసి కథ చెప్పాం. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. వరుస లాక్డౌన్లు వచ్చాయి. ఈ కష్టసమయంలోనూ ఆర్థికంగా చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఓటీటీకి అమ్మడానికి భారీ ఆఫర్ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి. ఆ దమ్మున్న వ్యక్తి పూరిగారు. ఇది థియేటర్ ఫిల్మ్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాం. దృఢ సంకల్పం ఉన్న పూరిలాంటి వ్యక్తి కూడా ఈ జర్నీలో కొన్నిసార్లు నిరాశకు గురయ్యారు. కానీ, రెండే రెండు విషయాలు ఇక్కడ వరకూ తీసుకొచ్చాయి. ఒకటి విజయ్ దేవరకొండ. ప్రతి పరిస్థితుల్లో విజయ్ ఎంత బలంగా నిలబడ్డాడో జనాలకు తెలియదు. నువ్వే (విజయ్) మమ్మల్ని ముందుకు నడిపిన వ్యక్తివి. రెండోది కంటెంట్. ఈ సినిమా కథ. థ్యాంక్యూ విజయ్’’ అంటూ ఛార్మి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు.