Guntur Kaaram: అభిమానులతో ‘గుంటూరు కారం’ చూసిన మహేశ్‌ బాబు.. ఫొటోలు వైరల్‌

మహేశ్‌ హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని వీక్షించారు.

Updated : 12 Jan 2024 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గుంటూరు కారం’ను అభిమానులతో కలిసి వీక్షించారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ హ్యాట్రిక్‌ మూవీ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో మహేశ్‌ దీన్ని చూశారు. తమ హీరోను చూసిన అభిమానులు ఆనందంతో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా కనిపించగా జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. రమణ పాత్రలో మహేశ్‌ మాస్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని