Megha Akash: న్యాయం చేస్తానో.. లేదో అని భయపడ్డా!
‘‘ఊహలకందని కథనంతో.. ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తిస్తూ సాగే చిత్రం ‘రావణాసుర’. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అంది నటి మేఘా ఆకాష్. రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. మేఘ ఓ నాయికగా నటించింది.
‘‘ఊహలకందని కథనంతో.. ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తిస్తూ సాగే చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అంది నటి మేఘా ఆకాష్ (Megha Akash). రవితేజ (Raviteja) హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. మేఘ ఓ నాయికగా నటించింది. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. తాజా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో మేఘా పంచుకున్న విశేషాలు...
* ‘‘ఏడాది క్రితం సుధీర్ వర్మ నాకీ కథ వినిపించారు. అప్పుడే నాకు చాలా నచ్చేసింది. ‘హీరోలెవరు లేరు’ అనే పాయింట్ చాలా ఆసక్తిరేకెత్తించింది. రవితేజ వంటి ఓ అగ్ర హీరో ఇలాంటి కథలో నటిస్తుండటం ఇంకా బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కాకపోతే ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది. ఎందుకంటే ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా.. సవాల్తో నిండి ఉంటుంది. పూర్తిగా న్యాయం చేయగలనో.. లేదో అని భయపడ్డా. కానీ, ఇలాంటి సవాల్తో కూడిన పాత్రలు చేసినప్పుడే నాలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకురాగలుగుతా అనిపించి ఓకే చెప్పా’’.
* ‘‘నటిగా నా ప్రయాణం పట్ల.. ఇప్పటి వరకు నాకు దక్కిన గుర్తింపు పట్ల సంతృప్తితో ఉన్నా. అతిగా ఆశించడం నాకు నచ్చదు. కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తా. అందుకే ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు చేసేయాలని అనుకోను. ఏమాత్రం విరామం దొరికినా ఇంట్లో వాళ్లతో కలిసి గడపటానికే ఇష్టపడతా. నా సినిమాల్ని నేనెప్పుడూ ఒక్కసారే చూసుకుంటా. అదీ ఓ మామూలు ప్రేక్షకుడిలాగే చూసి ఆస్వాదిస్తా. అంతే తప్ప ప్రతి చిత్రాన్నీ విమర్శనాత్మక కోణం నుంచి చూస్తూ ఏదొకటి నేర్చేసుకోవాలనైతే అనుకోను. సెట్లో నేనెప్పుడూ మానిటర్ చూడను. ‘బాగా చేశానా.. లేదా?’ అని దర్శకుడ్నే అడిగి తెలుసుకుంటా. వాళ్ల నిర్ణయాలకు అనుగుణంగానే నటిస్తూ వెళ్తా’’.
* ‘‘నేను ఇష్టపడే వాతావరణంలో నాకు నచ్చిన పాత్రలతో ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తా. తెలుగులో నాకు అందరు హీరోలతో కలిసి పని చేయాలని ఉంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్తో కలిసి చేయాలన్నది కల. ప్రస్తుతం తమిళంలో విజయ్ ఆంటోనితో ఓ సినిమా చేస్తున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో సంతానంతో కలిసి ఓ చిత్రం చేస్తున్నా. తెలుగులో మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి’’.
* ‘‘బోలెడన్ని ట్విస్ట్లు, షాక్లతో నిండిన సినిమా ఇది. ఇందులోని ప్రతి అంశం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఊహలకు అందని రీతిలో సాగుతుంది. ఇందులో నా పాత్ర పేరు హారిక. బాగా డబ్బున్న అమ్మాయిని. క్లాస్గా కనిపిస్తా. నేనిప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా.. కొత్తగా ఉంటుంది. వినోదం పంచుతూనే భావోద్వేగభరితంగానూ కనిపిస్తుంది. నటనకు ఆస్కారమున్న పాత్రిది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్