Rangabali: సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ వల్ల బాధపడి ఉంటే క్షమించండి: నాగశౌర్య
Rangabali: నాగశౌర్య, యుక్తి తరేజా కీలక పాత్రల్లో పవన్ తెరకెక్కించిన ‘రంగబలి’ సక్సెస్మీట్ శనివారం జరిగింది.
హైదరాబాద్: తాజాగా విడుదలైన తమ చిత్రం ‘రంగబలి’ని (Rangabali) ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు సినిమా చూసి ‘బాగుంది’ అని మెచ్చుకుంటున్నారని కథానాయకుడు నాగశౌర్య అన్నారు. శనివారం ‘రంగబలి’ సక్సెస్మీట్ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు పవన్ బాసంశెట్టి, కథానాయిక యుక్తితరేజా తదితరులు విలేకరులతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘మీడియాపై సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది?’ అని అడగ్గా, నాగశౌర్య (Naga Shaurya) సమాధానం ఇస్తూ, ‘‘మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్లు, చంద్రబాబునాయుడు, కేసీఆర్ డూప్లను పెట్టి వీడియోలు చేస్తారు. మా సినిమా ప్రమోషన్స్ కోసం అందరికీ తెలిసిన వ్యక్తులను ఎంపిక చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా? అని సరదాగా చేశాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు. అలాగే ముందుగా అనుకుని మాత్రం చేయలేదు. మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే ‘క్షమించండి’. ఫలానా వారి మనోభావాలు దెబ్బతీయాలని మాత్రం ఆ వీడియో చేయలేదు. ‘ఒకరిద్దరు బాధపడ్డారు’ అని వేరే వాళ్లు ప్రచారం చేయడం వల్ల ఆ న్యూస్ ట్రెండ్ అయింది’’ అని నాగశౌర్య సమాధానం ఇచ్చారు. అలాగే ద్వితీయార్ధం సీరియస్గా ఉందన్న కామెంట్స్పై మాట్లాడుతూ.. ‘‘ఫస్టాఫ్లో కామెడీ డోస్ ఎక్కువ అయిపోయింది. కంటెంట్తో వెళ్తేనేమో మరీ సాగదీశారని అంటారు. కేవలం నవ్వుల కోసమే అయితే, మా దగ్గర చాలా సీన్స్ ఉన్నాయి. జనాలను చెడగొట్టకుండా ఏదో ఒక మంచి కథతో రావాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకూ చాలా మంది హీరోలు ఇలాగే వచ్చారు. కేవలం అడాల్ట్ కంటెంట్, వెకిలి కామెడీ కావాలంటే మా దగ్గర చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి’’ అని నాగశౌర్య చెప్పుకొచ్చారు.
‘సినిమా కథ కన్నా కూడా ప్రచారం కోసం స్పూఫ్లపై దృష్టి ఎక్కువగా పెట్టారు. అలా కాకుండా సెకండాఫ్పై ఇంకా దృష్టి పెట్టి ఉంటే, మంచి విజయం సాధించేది కదా’ అని అడగ్గా, దర్శకుడు పవన్ సమాధానం ఇస్తూ ‘‘గోదావరి జిల్లాల వాళ్లకు వెటకారం పుట్టుకతో వచ్చింది. స్క్రిప్ట్ పరంగా ఎలాంటి సమస్యా లేదు. దానిపై నేను వందశాతం నమ్మకంతో ఉన్నా. ఫస్టాఫ్లో ఫన్ ఎక్కువగా ఉందంటే దానికి హీరో నాగశౌర్య, సత్యల పాత్రలు కారణం. ద్వితీయార్ధంలోనూ ఆ పాత్రలు ఉన్నాయి. అయితే, కథ అనేది ఒకటి చెప్పాలి. ఒక దర్శకుడిగా దానికి కట్టుబడి ఉన్నా. ఫస్టాఫ్ చూసి, సెకండాఫ్ కూడా అలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. బిర్యానీ తినేవాడిని పప్పన్నం తినమంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. నెమ్మదిగా అందరికీ నచ్చుతుంది. ఇక స్ఫూఫ్ ఇంటర్వ్యూల విషయానికొస్తే, చిన్నప్పటి నుంచి మనం చిరంజీవి, పవన్కల్యాణ్ల సినిమాలు చూసి, వాళ్లు చేసినట్లే చేసి, హీరోల్లా ఫీలవుతాం. ఇంటర్వ్యూ కూడా అలాంటిదే. రెండో భాగంలో కూడా సత్య క్యారెక్టర్తో కామెడీ చేయించవచ్చు. అప్పుడు నేను రాసుకున్న కథకు న్యాయం చేయలేను. పైగా అంత పెద్ద టైటిల్ పెట్టుకుని ఇంత ఫన్నీగా సినిమా ఎలా తీశాడంటారు’’ అని సమాధానం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!