Maniratnam: ఆయనతో పని చేసిన క్షణాలు నాకు మధుర జ్ఞాపకాలు: నాగార్జున

నాగార్జున తాజాగా విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’ పై ప్రశంసలు కురిపించారు.

Published : 06 Oct 2022 00:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: టాలీవుడ్‌లో ఉన్న టాప్‌హీరోల్లో నాగార్జున ఒకరు. మాస్‌, క్లాస్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇటీవల ఈ హీరో నటించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’ ఈ సినిమా తమిళంలోనూ విడుదలవుతున్న సందర్భంగా అక్కడ విలేకర్లతో మాట్లాడారు. తాను పుట్టింది చెన్నైలోనేనని ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లామని అన్నారు. చెన్నైకు వచ్చిన ప్రతిసారి పుట్టింటికి వస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన తెలిపారు. అలాగే తాజాగా విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’ పై ప్రశంసలు కురిపించారు.

‘‘నేను ‘ది ఘోస్ట్‌’ గురించి మాట్లాడే ముందు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ గురించి మాట్లాడాలి. మణిరత్నంను అభినందించాలి. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి రుజువైంది. ఈ సినిమా ఆయన ఏన్నో ఏళ్ల కల. ఈ సినిమా గురించి నాతో చాలా సార్లు మాట్లాడారు. 1988లో ఆయనతో కలిసి ‘గీతాంజలి’ సినిమా తీసిన క్షణాలు నాకు ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలు. అతని పనితీరు ప్రశంసనీయమైంది. అలాగే పొన్నియిన్‌ సెల్వన్‌ టీం అందరికీ అభినందనలు చెప్పాలి. హీరో విక్రమ్‌, నా తమ్ముడు కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, ఏఆర్‌ రెహమాన్‌ అందరికీ పేరుపేరున అభినందనలు అందరూ కలిసి అద్భుతమైన సినిమాని అందించారు’’ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు