Nayanthara: ధనుష్‌ వల్లే నయనతారను కలిశాను: విఘ్నేశ్ శివన్‌

ధనుష్ వల్లే నయనతారతో పరిచయం ఏర్పడిందని విఘ్నేశ్‌ చెప్పారు.

Published : 06 Apr 2024 22:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలో అందమైన జోడీల్లో నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల జంట ఒకటి. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరూ పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. తాజాగా విఘ్నేశ్‌ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. హీరో ధనుష్‌ వల్లే నయనతారతో పరిచయం ఏర్పడిందన్నారు.

ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్‌ (Vignesh Shivan) 2015 నాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘నేను దర్శకత్వం వహించిన ‘నేను రౌడినే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించాను. వెంటనే ఓకే చేసింది. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైందని తెలిసిన తర్వాత.. మొదట నో చెప్పిన విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో హీరోగా నటించేందుకు అంగీకరించారు. ఈ మూవీ చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది. ధనుష్‌ చెప్పకపోతే నాకు ఆమెను తీసుకోవాలనే ఐడియా వచ్చేది కాదు. అతడి వల్లే నేను నయనతారను కలిశాను. అలా మా పరిచయానికి ధనుష్‌ పరోక్షంగా కారణమయ్యాడు’ అని చెప్పారు. దీనిపై నయన్‌ (Nayanthara) స్పందిస్తూ.. విఘ్నేశ్‌ తనకు మూడు నెలల్లోనే దగ్గరైనట్లు తెలిపారు. కొన్ని బంధాలు మనసుతో త్వరగా ముడిపడతాయన్నారు.

ఇక ఈ చిత్రంతో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు. ఇటీవల ఈ జంటపై రూమర్స్‌ రాగా ఒక్క వీడియోతో వాటికి చెక్‌ పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని