Animal: ‘యానిమల్‌’ సీక్వెల్‌.. ప్రారంభం అప్పుడే..?

‘యానిమల్‌’ సూపర్‌హిట్‌ కావడంతో దాని సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్రీకరణపై ప్రచారం జరుగుతోంది.

Published : 01 Feb 2024 02:03 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)- బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal). దానికి సీక్వెల్ ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్ట్‌ 2 (Animal Park) 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని, ఈ ఫిబ్రవరిలో స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ ఇప్పటికే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఖరారు చేశారు. దాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, రణ్‌బీర్‌ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దాంతో, వచ్చే ఏడాదే ‘యానిమల్‌ పార్క్‌’ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ‘‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని తెలిపారు.

తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్‌’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనూ వ్యూస్‌ విషయంలో టాప్‌లో నిలిచింది. రణ్‌బీర్‌తోపాటు రష్మిక, త్రిప్తి దిమ్రి, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, పృథ్వీరాజ్‌ తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని