Sai Dharam Tej: ఆ విషయం నన్నెంతో భయపెడుతుంది: సాయి ధరమ్‌ తేజ్‌

అభిమానులకు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam tej) తాజాగా ఓ విన్నపం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.

Published : 04 Aug 2023 18:47 IST

హైదరాబాద్‌: నటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) గత కొన్నిరోజుల నుంచి ‘బ్రో’ (BRO) విజయయాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పర్యటిస్తోన్న ఆయన తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఓ విషయం తనను ఎంతగానో కలవరపాటుకు గురి చేస్తోందన్నారు. అభిమానులందరూ సురక్షితంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు.

‘‘బ్రో’ విజయయాత్రలో భాగమై నాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరినీ కలుసుకోవడం, అభిమానం పొందడం, సినిమా గురించి మీ మాటల్లో వినడం నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఆప్యాయంగా సెల్ఫీలు, ఫొటోలు అడిగిన ప్రతి ఒక్కరికీ నేను అందుబాటులో ఉంటున్నా. అయితే, కొంతమంది మాత్రం హెల్మెట్‌ ధరించకుండా బైకుల మీద మమ్మల్ని ఫాలో చేయడం.. డ్రైవింగ్‌ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం  చేస్తున్నారు. ఇలాంటి పనులు నన్నెంతగానో భయానికి గురి చేస్తున్నాయి. అభిమానంతో మీరు ఇలా చేస్తున్నప్పటికీ.. మీకు ఏదైనా హాని జరిగితే తీవ్ర మనస్థాపానికి లోనవుతా. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల కంటే ఎక్కువగా బ్రోస్‌లా భావిస్తున్నా. మీ భద్రత నా బాధ్యత. బైక్‌పై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించండి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇక నాకు నడిచే ఓపిక లేదు: ఆత్మహత్యకు ముందు నితిన్‌ ఆవేదన

‘వినోదాయ సిత్తం’ రీమేక్‌గా ‘బ్రో’ చిత్రం రూపుదిద్దుకుంది. సముద్రఖని దర్శకుడు. సాయి తేజ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ కీలకపాత్రలో కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. పవన్‌కల్యాణ్‌ రోల్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని