Samantha: ‘ఏమాయ చేసావె’పై సమంత పోస్ట్‌ వైరల్‌

అగ్రకథానాయిక సమంతను తెలుగు తెరకు పరిచయం చేసిన రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే...

Published : 26 Feb 2022 12:07 IST

వాటి చుట్టూ నా జ్ఞాపకాలు..

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంతను తెలుగు తెరకు పరిచయం చేసిన రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సామ్‌ నటిగా తెరంగ్రేటం చేశారు. ఈ ఫీల్‌గుడ్‌ మూవీ విడుదలై శనివారంతో 12 సంవత్సరాలైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సమంత తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఇన్ని సంవత్సరాలుగా తనని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘‘చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటితో 12 సంవత్సరాలైంది. లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. వీటి చుట్టూ నాకున్న మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల గొప్ప ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. కెమెరాతో నా ప్రేమకథ ఇలాగే ఎంతోకాలం కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని సమంత పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా కోసమే నాగచైతన్య-సమంత మొదటిసారి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్‌లోనే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. గతేడాది వాళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ చెప్పిన క్రమంలో సమంత.. తన తొలి చిత్రం గురించి పోస్ట్‌ పెట్టడంతో.. ఇప్పుడు ఇది కాస్త వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని