Sandeep Reddy: ‘యానిమల్‌’ చూశాక ఆ హీరో 40 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడాడు: సందీప్ వంగా

‘యానిమల్‌’ చూసి బాలీవుడ్‌ హీరో తనతో 40 నిమిషాలు ఫోన్లో మాట్లాడినట్లు సందీప్ వంగా చెప్పారు.

Updated : 05 Feb 2024 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ - సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్‌’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ‘యానిమల్‌’పై తన స్పందనను సందీప్‌కు ఫోన్ చేసి చెప్పారట. ‘ఈ చిత్రానికి రణ్‌వీర్‌ సింగ్‌ ఇచ్చిన రివ్యూను నేను మర్చిపోలేను. దాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ‘యానిమల్‌’ చూశాక నాకు ఫోన్‌ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత ఓ సుదీర్ఘ మెసేజ్‌ పెట్టాడు. దాన్ని నాలుగు సార్లు చదువుకున్నా. చాలా ఆనందం వేసింది. సినిమా గురించి చాలా విషయాలు రాశాడు. ఇందులో ఇన్ని విశేషాలున్నాయా అని నేనే ఆశ్చర్యపోయాను’ అని చెప్పారు.

‘హనుమాన్‌’ కోసం 70 ప్రాజెక్ట్‌లు వదులుకున్నా..: తేజ సజ్జా

‘యానిమల్‌’ విడుదలయ్యాక ‘కబీర్‌సింగ్‌’ కూడా రణ్‌బీర్‌తో చేస్తే బాగుండేది అని కామెంట్స్‌ వినిపించాయి. వీటికి సందీప్ సమాధానం చెప్పారు.‘‘కబీర్‌ సింగ్‌’ రీమేక్‌ సినిమా. రణ్‌బీర్‌ రీమేక్‌లు చేయను అని స్పష్టంగా చెప్పాడు. అందుకే ఆ ప్రాజెక్ట్‌ చేయలేదు’ అన్నారు. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసిన ‘యానిమల్‌’కు త్వరలోనే సీక్వెల్‌ రానుంది. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని సందీప్ అన్నారు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యమన్నారు. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయని.. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని