Varisu: విజయ్‌ ‘వారిసు’ కోసం పాటపాడిన ప్రముఖ హీరో...!

విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ‘వారిసు’. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 26 Nov 2022 01:40 IST

హైదరాబాద్‌: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ చిత్రం కోసం శింబు ఓ పాట పాడారని కొన్ని ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను రెండురోజుల ముందే రికార్డు చేశారని టాక్‌.

గతంలో శింబు గొంతు కొన్ని సినిమాల్లోని పాటల్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్‌ చిత్రం ‘డబుల్‌ ఎక్స్ఎల్‌’లో ఓ పాట పాడిన ఈ సూపర్‌ హీరో విజయ్‌తో ఉన్న స్నేహాంతో వారసుడులో పాడరని అంటున్నారు. ఇక ఈ పాటను డిసెంబర్‌ రెండో వారంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌చేస్తున్నారట. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలో డిసెంబర్‌23న నిర్వహించే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమాలోని ‘రంజిదమే’ పాట విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాటకు కోట్లలో వ్యూస్‌ వచ్చాయి. విజయ్‌, రష్మికల స్టెప్పులకు ఫిదా అయిన పలువురు వీరిలానే డ్యాన్స్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ట్రెండ్‌ సృష్టించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని