Salaar: అప్పుడు ‘సలార్’లో నటించేందుకు అంగీకరించలేదు.. కానీ!: శ్రియారెడ్డి
ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ఇందులో కీలక పాత్ర పోషించిన శ్రియారెడ్డి మీడియాతో ముచ్చటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘పొగరు’ (pogaru) సినిమాలోని ఓ కీలక పాత్రతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటి శ్రియారెడ్డి (Sriya Reddy). ఇన్నేళ్లలో అతి తక్కువ సినిమాలు చేసిన ఆమె.. ‘సలార్’ (Salaar)లోని రాధారమ మన్నార్ క్యారెక్టర్తో మరోసారి అదే స్థాయిలో అలరించించారు. ప్రభాస్ (Prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన చిత్రమిది. శ్రుతిహాసన్ కథానాయిక. డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమాకి మంచి విజయం దక్కడంతో శ్రియారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ప్రశాంత్ పట్టుపట్టారు..
‘‘ప్రశాంత్ నీల్ నన్ను కలిసి, ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నటించేందుకు అంగీకరించలేదు. ఎందుకంటే నేను సినిమాలు చేయకూడదని అప్పటికే నిర్ణయించుకున్నా. కానీ, ఎలాగైనా నటింపజేయాలని ప్రశాంత్ పట్టుపట్టారు. స్క్రిప్టు పూర్తిగా విని ఆ తర్వాత సమాధానం చెప్పమన్నారు. నాకు ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పా. స్క్రిప్టులో తొలుత నా పాత్ర లేదు. కథలోకి లోతుగా వెళ్లే క్రమంలో లేడీ విలన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత ఆ క్యారెక్టర్ను రాశారు. అందులో విలనిజాన్ని టచ్ చేస్తూనే అందంగా చూపించాలనుకున్నారు. ‘పొగరు’ సినిమాలోని నా నటన నచ్చడంతో ప్రశాంత్ ‘సలార్’లోని రాధారమ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఈ పాత్రకు మంచి పేరు వస్తుందని ప్రశాంత్ నీల్ నాకు ప్రామిస్ చేశారు. ఎలాంటి సందేహం లేకుండా సెట్కు వచ్చి నటించమన్నారు. ఆయనకు తన స్క్రిప్ట్ మీద అంత నమ్మకం. అనుకున్నట్లుగానే నాకు మంచి పేరు వచ్చింది. చిత్రీకరణ సమయంలో అలా చేయను.. ఇలా చేయను అని చాలాసార్లు చెప్పా. కానీ, చివరకు ఓ చిన్న పిల్లలాగా నన్ను ఒప్పించేవారు’’
‘సలార్ 2’.. మరో స్థాయిలో..
‘‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘కేజీయఫ్’, ‘బాహుబలి’ తదితర సినిమాల తొలి భాగాల కథలు చాలామందికి అర్థంకావు. ‘సలార్’ కూడా అంతే. ఫస్ట్ పార్ట్లో మేం కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాం. సెకండ్ పార్ట్ మరో స్థాయిలో ఉంటుంది. రెండో భాగంలో నా పాత్ర నిడివి ఎక్కువ. ప్రభాస్ స్వీట్ పర్సన్. ఎప్పుడూ కూల్గా ఉంటారు. ఆయనలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఎక్కువగా మాట్లాడరు’’
అంతకుమించి చెప్పలేను!
‘‘పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమా స్టోరీ చాలా బాగుంటుంది. అందులో యాక్షన్తోపాటు మంచి ఎమోషన్ ఉంది. ప్రకాశ్రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటారు. నేనిందులో నెగెటివ్ రోల్లో నటించడం లేదు. కానీ, చాలా విభిన్న పాత్ర అది. అంతకు మించి ఇప్పుడు ఇతర వివరాలు చెప్పలేను. ఈ సినిమా తర్వాత రిటైర్డ్ అయిపోతానేమో (నవ్వుతూ)..!’’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.