Sukumar: ఏది రాసినా సోషల్‌ మీడియాను దృష్టిలో పెట్టుకుంటా : సుకుమార్‌

‘పుష్ప’ (Pushpa) సినిమాలోని డైలాగులు, పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు సుకుమార్‌ (Sukumar) మాట్లాడారు.

Published : 23 Feb 2023 13:27 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్‌ (Allu Arjun) కెరీర్‌లోనే ఓ భారీ విజయంగా నిలిచింది. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు కుర్రకారును హోరెత్తించాయి. అలాగే సోషల్‌ మీడియాలోనూ ట్రెండ్‌ సెట్‌ చేశాయి. దీని సీక్వెల్‌గా ‘పుష్ప-2’ (Pushpa 2) రూపొందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ సినిమాల విషయంలో సోషల్‌ మీడియా, రీల్స్‌ ఎంత ముఖ్యమైనవిగా మారాయో తెలిపారు. 

‘‘నేను సినిమాకు సంబంధించిన డైలాగులు, పాటలు రాసేటప్పుడు అవి ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో వస్తాయని భావించి రాస్తాను. వాటినే దృష్టిలో పెట్టుకుంటాను. మనం రాసే డైలాగులు సోషల్‌ మీడియాలో అభిమానులను ఎంతో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చాలామంది రీల్స్‌, షార్ట్‌లకు కనెక్ట్‌ అయ్యారు. ‘పుష్ప’ (Pushpa) సినిమా విజయం వెనక ఇది కూడా ఒక భాగమే. సోషల్‌మీడియాలో పుష్పలోని డైలాగులు, పాటలు ఎంతో వైరల్‌ అయ్యాయి. అందుకే ‘పుష్ప2’కు కూడా అదే వ్యూహాన్ని కొనసాగిస్తున్నా’’ అని సుకుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం ఆయన ‘పుష్ప2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా వైజాగ్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే ఈ షూటింగ్‌లో నేషనల్‌ క్రష్‌ రష్మిక పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ పాత్రలో నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని